ఆంధ్రప్రదేశ్‌

కుప్పంలో సూదిగాడు హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 27: చిత్తూరు జిల్లా కుప్పంలో సోమవారం సూదిగాడు హల్‌చల్ చేసిన ఘటన కలకలం సృష్టించింది. సిరంజిలతో మహిళలపై దాడి చేసి గాయపరచిన ఘటన కుప్పంలో తీవ్ర సంచలనం సృష్టించింది. కర్నాటక రాష్ట్రం బంగారుపేట్‌కు చెందిన ఇద్దరు అరుల్(18), నవీన్(18) యువకులు స్థానిక ఎన్టీఆర్ కాలనీ వద్ద ఓ ముస్లిం మహిళపై సిరంజితో దాడి చేయగా వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అరున్, నవీన్ చేతిలో సిరంజితో పాటు వైట్‌నెర్‌తో స్థానిక ఎన్టీఆర్ కాలనీ వద్ద ఓ ముస్లిం మహిళ ఇంటికి వెళ్లి మీ పిల్లలను మా పాఠశాలలో చేర్పించాలని చెబుతూ మాటల్లో ఉంచిన యువకులు ఒక్క సారిగా ఆమెపై సిరంజితో దాడి చేయగా అప్రమత్తమైన ఆమె వెంటనే తేరుకొని కేకలు వేసింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు అరుల్ అనే యువకుడ్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే నవీన్ అనే యువకుడు పారిపోయాడు. ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్న అరున్‌ను పలు కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఈ సూదిగాడు దాడిలో గాయపడ్డ ముస్లిం మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ఈమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్దారించారు. అయితే ఈ సూదిగాళ్లు సంచారంతో కుప్పం వాసులు భయాందోళనకు లోనైయ్యారు. అయితే ఈ సిరంజిలో మత్తుమందు ఉందా...తదితర విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.