ఆంధ్రప్రదేశ్‌

పిడుగుపాటుకు 26 మేకలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరాపల్లి, జూన్ 25: విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం వెంకట్రాజపురం సమీపంలో శనివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో పిడుగు పడడంతో 26 మేకలు మృతి చెందాయి. పిడుగు పడిన సమయంలో సుమారు 130 వరకు మేకలు ఒక చింతచెట్టు కింద ఉన్నాయి. ఆ చెట్టుపై పిడుగు పడడంతో అందులో 26 మేకలు అక్కడికక్కడే చనిపోయాయి. అదే చెట్టు తొర్రలో ఉన్న సబ్బి దేముళ్లు అనే వ్యక్తి వీపు పూర్తిగా కాలిపోయింది. సంఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న కొంత మంది దేముళ్లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 26 మేకలు చనిపోవడంతో దాదాపు రెండున్నర లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు.