ఆంధ్రప్రదేశ్‌

రైలు ఢీకొని తల్లి, కూతురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 25: రైలు ఢీకొని తల్లి, కూతురు మృతి చెందిన విషాద సంఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది. కుప్పం మండలం దళవాయి కొత్తపల్లెకు చెందిన ఫరానా(40), ఆమె కుమార్తె అల్లాస్(9) కుప్పంలో ఇంటికి సరుకులు తీసుకొని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సరుకులు తీసుకొని తల్లి, కూతురు ఇద్దరు కుప్పం సమీపంలోని అద్దం కాలనీ వద్ద వున్న రైల్వే ట్రాక్‌ను దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో వీరిద్దరు పక్కనే ఉన్న మురికి కుంటలో పడిపోయారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఆలస్యంగా గుర్తించారు. అనంతరం రైల్వే ట్రాక్‌పై చిందరవందరగా పడి వున్న నిత్యావసర వస్తువులను గమనించి మురికి కుంటలో మృత దేహాలు ఉన్న విషయాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు.