ఆంధ్రప్రదేశ్‌

ఉపాధ్యాయుడి దాష్టీకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, జూన్ 23: తరగతిగదిలో అల్లరి చేస్తోందన్న కారణంగా ఓ ఐదో తరగతి విద్యార్థిని పళ్లూడగొట్టాడు ఓ ఉపాధ్యాయుడు. అనంతపురం జిల్లా హిందూపురంలో బుధవారం జరిగిన ఈ సంఘటనపై గురువారం విద్యార్థిసంఘాలు ఆందోళన చేపట్టాయి. పూలకుంటలోని ప్రైవేటు నవోదయ కోచింగ్ సెంటర్‌లో చదువుతున్న సాయి శరణ్య అనే విద్యార్థిని తరగతి గదిలో అల్లరి చేస్తుండగా బుధవారం సాయంత్రం ఉపాధ్యాయుడు తేజోనాథ్ స్టీల్ స్కేల్ విసిరారు. అది శరణ్య నోటికి తగలడంతో పళ్లు ఊడిపోయాయి. అయితే విషయం బయటకు పొక్కనీకుండా యాజమాన్యం జాగ్రత్త పడింది. గురువారం విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు.