ఆంధ్రప్రదేశ్‌

మచిలీపట్నంలో బాంబు కలకలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 18: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శనివారం రాత్రి బాంబు కలకలం సృష్టించింది. కర్ణాటక ముఖ్యమంత్రి, గవర్నర్‌కు లీగల్ అడ్వైజర్‌గా భావిస్తున్న వికాస్ భాను సోడే అమ్మమ్మ చలమలశెట్టి సంజీవమ్మ స్వస్థలం మచిలీపట్నం. ఈమె మాచవరంలో నివశిస్తోంది. గత మూడు నెలల నుండి వికాస్ భాను సోడే ప్రతినెలా మూడో శనివారం తన అమ్మమ్మ ఇంటి పక్కనున్న ఆంజనేయస్వామి గుడిలో పేదలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం కూడా వైద్య శిబిరం నిర్వహించారు. ఈయనకు కర్ణాటకలో ప్రాణహాని ఉన్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే శనివారం సాయంత్రం 5గంటల సమయంలో ఆయన అమ్మమ్మ ఇంటి ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు ఒక బ్యాగ్, ఆ పక్కన కెమెరా ఫ్లాష్‌తో పాటు విద్యుత్ వైరును ఇంటి ఆవరణ మొత్తం అమర్చారు. దీన్ని గమనించిన వికాస్ భాను సోడే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారమిచ్చారు. బాంబ్ స్క్వాడ్ హుటాహుటిన అక్కడకు చేరుకుని దాన్ని నిశితంగా పరిశీలించారు. అయితే అది బాంబు కాదని, ఆ బ్యాగ్‌లో బియ్యం, ఎండు మిరపకాయలు ఉన్నాయని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి విజయ్‌కుమార్ ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి తెలిపారు.