ఆంధ్రప్రదేశ్‌

టిడిపిలోకి పారిశ్రామికవేత్త వేమిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 16: నెల్లూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. గురువారం ఆయన నెల్లూరులోని తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ రిషివ్యాలీలో ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి విద్యాసంస్థలో చదువుకున్న తనకు సమాజం పట్ల నిబద్ధత ఉందన్నారు. తాను ఎన్నో సామాజిక సేవలు చేశానన్నారు. ఇంకా చేయాలన్న సంకల్పంతో సేవలను విస్తరించేందుకు టిడిపిలోకి చేరుతున్నట్టు ప్రకటించారు. సన్నిహితుల సూచన మేరకు తాను శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమక్షంలో నెల్లూరులో టిడిపిలో చేరనున్నట్లు వెల్లడించారు.