ఆంధ్రప్రదేశ్‌

24, 25 తేదీల్లో బిజెపి రాష్ట్ర కార్యవర్గం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 16: భారతీయ జనతాపార్టీ రాష్టక్రార్యవర్గ సమావేశాలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించనున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి. పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌లోని పలువురు మంత్రులతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో ఉన్న నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరుకానున్నారు. ఇటీవల అలాహాబాద్‌లో భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గసమావేశాలు జరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని పార్టీ చీఫ్ అమిత్‌షా ఆదేశించారు. ఈ మేరకు భీమవరంలో సమావేశాలను ఏర్పాటుచేశారు. ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసవర్మ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లాలోని ముఖ్యనేతలు, మండల పార్టీ అధ్యక్షులు, ప్రతినిధులతో సమావేశాన్ని కూడా నిర్వహించారు. భారతీయ జనతాపార్టీ రాష్టక్రార్యవర్గ సమావేశాలు భీమవరంలో జరగడం ఇది మూడో పర్యాయం. పార్టీ రాష్టక్రార్యవర్గ సమావేశాలు చాలా కీలకమైనవి.