ఆంధ్రప్రదేశ్‌

కులాల మధ్య సిఎం చిచ్చు: రామచంద్రయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 16: రాష్ట్రం చంద్రబాబు సొంత జాగీరుకాదని శాసనమండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. కులాల మధ్య చిచ్చుపెడుతూ ప్రతిపక్షాలను, మీడియాను అణచివేస్తూ నిరంకుశ చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, కాపునేత ముద్రగడ దీక్షకు మద్దతుగా గురువారం కాంగ్రెస్ నాయకులు రిలేదీక్ష చేపట్టారు. దీక్ష శిబిరాన్ని సందర్శించిన అనంతరం రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు అన్నివర్గాలకు అలవిగాని హామీలిచ్చి, అధికార పగ్గాలు చేపట్టాక వాటి అమలులో మీనమేషాలు లెక్కిస్తున్నారని ధ్వజమెత్తారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు ముందుగా బిసి సంఘాలతో సమావేశమై మీకు నష్టం కలగకుండా చూసే బాధ్యత తనదని హామీ ఇచ్చివుంటే రాష్ట్రంలో ఉద్యమాలకు తావుండేది కాదన్నారు. వ్యక్తులతో పోట్లాడవచ్చు గానీ, కులాలతో పోట్లాడితే అది వారి పతనానికి దారి తీస్తుందని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాపు నాయకులు డిమాండ్ చేస్తుంటే అక్రమ అరెస్ట్‌లు చేయించడం సిగ్గు చేటన్నారు.