ఆంధ్రప్రదేశ్‌

కుల బహిష్కరణే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14:తెలంగాణ రాష్ట్రం కోసం వివిధ వ్యూహాలు రచించి చివరకు అనుకున్నది సాధించిన ఉద్యమ నేతల ఎత్తుగడను కాపునేతలు అనుసరించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌పై ఎవరు విమర్శలు చేసినా, వారిపై తెలంగాణ ద్రోహుల ముద్ర వేయడం ద్వారా ప్రత్యర్ధులను కట్టడి చేసిన టీఆర్‌ఎస్ వ్యూహాన్ని, ఏపిలో కాపు నేతలు కూడా అనుసరించేందుకు సిద్ధమవుతున్నారు.
కాపులను బీసీల్లో చేర్పించాలంటూ దీక్షలు నిర్వహిస్తున్న ముద్రగడ పద్మనాభంపై తెలుగుదేశం నాయకత్వం మాటల దాడులు చేస్తోంది. అదే సమయంలో టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న బిజెపి నేతలయిన కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజుపైనా ఎదురుదాడి చేస్తోంది. ఈ ఎదురుదాడికి టిడిపికి చెందిన కాపునేతలనే వినియోగిస్తోంది. ఏపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ, ఎమ్మెల్యే బొండా ఉమా, జ్యోతుల నెహ్రు, తోట త్రిమూర్తులు తదితరులను ముందుపెట్టి.. వారితోనే ముద్రగడ, ఇతర పార్టీల్లో టిడిపి విమర్శకులపై ఎదురుదాడి చేయిస్తోంది. చివరకు టిడిపి కాపు నేతలు ముద్రగడకు మద్దతునిస్తున్న కాపుసంఘాలు, పార్టీలపైనా విరుచుకుపడుతున్నారు. కమ్మ సామాజికవర్గం తమ వర్గంపై సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారంపైనా కాపుజాక్ దృష్టి సారించింది. ముద్రగడ దీక్షను విమర్శిస్తూ, ఆయనకు ప్రశ్నలు సంధించిన వైనం వాట్సాప్, ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేస్తోంది. దానికి కాపువర్గం కూడా అదే స్ధాయిలో ఎదురుదాడి చేస్తుండటంతో సోషల్ మీడియాలో జరుగుతున్న కమ్మ-కాపు యుద్ధం పతాక స్థాయికి చేరినట్టయింది. సొంత కులం వారితో సొంత కులం వారిపై ఎదురుదాడి చేయిస్తూ, విభజించి పాలిస్తున్న బాబు వ్యూహానికి విరుగుడు ఆలోచించాలని కాపుజాక్ చాలారోజుల నుంచి కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా, ఇకపై ముద్రగడతో పాటు, వివిధ పార్టీల్లో ఉన్న కాపు నేతలను విమర్శించే టిడిపి కాపు నేతలను కుల బహిష్కరణ చేయాలని, వారిని కాపు ద్రోహులుగా ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఫలితంగా ఇకపై మిగిలిన నాయకులెవరూ సొంత కుల నేతలను విమర్శించేందుకు మానసికంగా ముందుకురారని కాపు జాక్ భావిస్తోంది. ఈ మేరకు నేడో, రేపో కాపు జాక్ బహిరంగంగా పిలుపునిచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ‘మేం కూడా బాబు వ్యూహానికి పై ఎత్తు వేస్తున్నాం. ఒకటి రెండు రోజులు చూడండి. ఏం జరుగుతుందో. బాబును నమ్ముకుంటే ఏమవుతుందో, ఎంత నష్టం జరుగుతుందో టిడిపి కాపు నేతలు గ్రహిస్తార’ని ఆలిండియా కాపుజాక్ కన్వీనర్ సతీష్ గల్లా ఆంధ్రభూమితో చెప్పారు. ప్రభుత్వాన్ని విమర్శించే కాపు నేతలపై టిడిపి కాపు నేతలు ఎవరు విమర్శలు చేసినా, వారిని కాపుద్రోహులుగానే పరిగణించాలని సొంత కులానికి కాపు జాక్ నేతలు పిలుపునివ్వనున్నారు. ముఖ్యంగా ముద్రగడను విమర్శిస్తే, వారిని కాపుకులం నుంచి బహిష్కరించాలని కూడా పిలుపునివ్వనున్నట్లు సమాచారం.

చిత్రం... రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో
తూ.గో. జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్, అర్బన్ ఎస్పీ రాజకుమారి చర్చలు