ఆంధ్రప్రదేశ్‌

రూపాయికి ఇడ్లీ రూ. 5కు పులిహోర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14:రూపాయికి ప్లేట్ ఇడ్లీ, మూడు రూపాయలకు పెరుగన్నం, ఐదు రూపాయలకు పులిహోర! రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ‘అన్న’ క్యాంటీన్లలో రేట్లు ఇవి. మంగళవారం సిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రులు పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేయనున్న తొలి క్యాంటీన్‌ను రాజధాని వెలగపూడిలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని చెప్పారు. వచ్చే నెలలో మరో రెండు ప్రాంతాల్లో క్యాంటిన్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. అక్షయపాత్ర సంస్థకు ఈ క్యాంటిన్ల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తున్నట్టు మంత్రులు తెలిపారు. ఎన్టీఆర్ క్యాంటిన్‌లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించనున్నారు. ఉదయం ఇడ్లీ సాంబార్, పొంగల్, మధ్యాహ్నం భోజనం కింద లెమన్ రైస్, సాంబార్ రైస్, పెరుగన్నం ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రులు పేర్కొన్నారు.