ఆంధ్రప్రదేశ్‌

జనాన్ని మభ్యపెట్టడానికే బాబు దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, జూన్ 2 : టిడిపి అధినేత చంద్రబాబునాయుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో దోషులు, ఆర్థిక నేరస్థులను పార్టీలోకి చేర్చుకుని వారితో డబ్బులు దండుకుని ఎమ్మెల్యే టికెట్లు, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారని, ప్రస్తుతం రాజ్యసభ సీట్లను కూడా అదే తరహాలో డబ్బు తీసుకుని ఇచ్చారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో గురువారం రఘువీరా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయాల్లో ఆర్థికంగా ఉన్న వారికి పదవులు ఇవ్వడం వల్ల పేద వర్గాలకు అవకాశాలు లేకుండా చంద్రబాబు అపకారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. టిడిపి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దీంతో ప్రజలను మభ్య పెట్టడానికే నవ నిర్మాణ దీక్ష చేపట్టారన్నారు. ఆ దీక్షేదో ఢిల్లీలో ప్రధాని మోదీ ఇంటి ముందు చేపట్టి ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను సాధించాలని సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధులు తీసుకురావడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారన్నారు.