ఆంధ్రప్రదేశ్‌

కట్టుకున్నవాడే కాలయముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనిగిరి రూరల్, మే 31: కట్టుకున్నవాడే కాలయముడుగా మారాడు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య, ఇద్దరు కన్నబిడ్డలపై ఏమాత్రం మానవత్వం లేకుండా వారి మెడలకు తాడుతో ఉరి బిగించి చంపేశాడు. ఈ సంఘటన మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని చింతలపాలెంలో చోటుచేసుకుంది. స్థానిక సిఐ యు సుధాకర్‌రావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చింతలపాలెం గ్రామంలోని తమ్మినేని శ్రీనివాసరెడ్డికి గత కొనే్నళ్ల క్రితం మొదటి భార్య వెంకటలక్ష్మి మృతి చెందింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. అనంతరం పదేళ్ల క్రితం ఆదిలక్ష్మి (28) అనే యువతితో వివాహమైంది. వీరికి గణేష్ (7), భవాని (5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెడు వ్యసనాలకు బానిస అయిన భర్త శ్రీనివాసరెడ్డికి దూరంగా ఆదిలక్ష్మి కొంతకాలంగా బాపట్లలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. నాలుగు రోజుల క్రితం శ్రీనివాసరెడ్డి ఆదిలక్ష్మితోపాటు ఇద్దరు పిల్లలను చింతలపాలెం తీసుకొచ్చాడు. సోమవారం రాత్రి ఇంటి మేడపై పడుకున్న ఆదిలక్ష్మి, గణేష్, భవానీలను తాడుతో ఉరివేసి హత్య చేశాడు. అనంతరం శ్రీనివాసరెడ్డి కూడా ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాసరెడ్డిని మొదటి భార్య కూతురు గమనించి కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ముందుగా అతడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాసరెడ్డిని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.