ఆంధ్రప్రదేశ్‌

ప్రశాంతంగా లాసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, మే 28 : ఆంధ్రప్రదేశ్ లా సెట్-2016 యుజి, పిజి ప్రవేశ పరీక్షలకు 12,368 మంది హాజరైనట్లు లా-సెట్ రాష్ట్ర కన్వీనర్ పుల్లారెడ్డి తెలిపారు. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయలు యూనివర్శిటీ ఆవరణలో ఉన్న లాసెట్ కార్యాలయంలో శనివారం ఆయన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన లా సెట్-2016 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. ఇందులో మూడేళ్ల కోర్సులో 9,520 మంది విద్యార్థులకు గానూ 7,884 మంది, ఐదేళ్ల కోర్సుకు 2,496 మందికి 2,042 మంది, పిజి కోర్సులకు 622 మందికి 525 మంది హాజరయ్యారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోర్సుల్లో 12,638 మంది విద్యార్థులకుగాను 12,368 మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులు పరీక్షలు రాసారని తెలిపారు.