ఆంధ్రప్రదేశ్‌

రథోత్సవంలో విషాదం.. వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: గుంటూరు జిల్లా అమరావతిలో మంగళవారం సాయంత్రం జరిగిన బాలచాముండికా అమరేశ్వరస్వామివార్ల దివ్య రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. రథోత్సవం ప్రారంభమైన 20 నిముషాల్లోపే తోపులాట జరగడంతో కొంతమంది రథ చక్రాల కిందపడ్డారు. గాయ పడ్డవారిలో కోట మురళి మృతి చెందాడు. పెదకూరపాడు మండలం బలుసుపాడుకు చెందిన కోట మురళికి ఛాతి, పక్కటెముకలపైగా రథ చక్రం ఎక్కడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతిచెందాడు. అమరావతి మండలం ధరణికోటకు చెందిన పాటిబండ్ల దుర్గారావు కుడికాలికి బలమైన గాయం కావడంతో అతన్ని కూడా జిజిహెచ్‌కు తరలించారు. ప్రమాదంలో ముత్తాయపాలెం గ్రామానికి చెందిన దాడిపర్తి రమణమ్మ, ధరణికోట గ్రామానికి చెందిన మల్లెల చింతయ్య, అమరావతికి చెందిన అప్పా రాజేష్ కూడా స్వల్పగాయాలు కావడంతో అమరావతి 30 పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.