ఆంధ్రప్రదేశ్‌

కర్నూలు టిడిపి ఆఫీసుపై ఎమ్మార్పీఎస్ దాడి, విధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఏప్రిల్ 23: ఎస్సీ వర్గీకరణపై ఎన్నికల ముందు ఇచ్చిన హామీని విస్మరించారంటూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు శనివారం కర్నూలు నగరంలోని టిడిపి కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అధికారంలోకి రాగానే వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి, పార్లమెంట్ ఆమోదం కోసం డిల్లీకి పంపుతామని హామీ ఇచ్చా మోసం చేశారని ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నేతలు ధ్వజమెత్తారు. ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ చేయకుండ మాదిగలను మోసం చేశారన్నారు. ఎస్సీ కులం లోని ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తూ వారికే పదవులు కట్టబెట్టుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలుగు దేశం పార్టీ దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కార్యాలయంలోని టివీ, ఎయిర్ కూలర్, కుర్చీలను పగులగొట్టారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం 36మంది ఎమ్మార్పీయస్ నాయకులను అరెస్ట్ చేశారు.