ఆంధ్రప్రదేశ్‌

జూన్‌లో ఇండో-యుకె ప్రాజెక్టుకు శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 22: రాజధాని నగరం అమరావతిలో తలపెట్టిన ప్రతిష్ఠాత్మక మెగా హెల్త్‌కేర్ ప్రాజెక్టుకు జూన్‌లో శంకుస్థాపన జరగనుంది. ఇండో-యుకె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఐయుఐహెచ్) ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ మెడికల్ ప్రాజెక్టులో భాగంగా రూ.1000 కోట్లతో వైద్య, ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని, వెయ్యి పడకల మెగా ఆస్పత్రిని నెలకొల్పుతారు. వీటికి అనుబంధంగా మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారీ యూనిట్, మెడికల్ డేటా అనలిటిక్స్ సెంటర్, వైద్య సంబంధిత విభాగాలు, పరిశోధన, శిక్షణ సంస్థలను ఏర్పాటు చేస్తారు. మొత్తం అన్ని విభాగాలు కలిపి ‘హెల్త్‌కేర్ సిటీ’గా వ్యవహరించే ఈ మెగా ప్రాజెక్టును 2018 జూన్ నాటికి పూర్తిచేసి ప్రారంభించడానికి ఐయుఐహెచ్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఐయుఐహెచ్ ప్రతినిధుల బృందం ఈ నెల 25, 26 తేదీల్లో అమరావతిలో పర్యటించనుంది. దేశంలో ఐయుఐహెచ్ నిర్మించతలపెట్టిన మొత్తం 11 మెగా మెడికల్ ప్రాజెక్టులకు అమరావతిని హెడ్ క్వార్టర్స్‌గా చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన సూచన మేరకు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఇక్కడ హెల్త్‌కేర్ కేంద్రాన్ని నెలకొల్పుతున్నారు. దేశంలో ఏర్పాటయ్యే 11 ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, ఇతర విభాగాలకు అమరావతి కేంద్ర కార్యాలయంగా ఉంటుంది. ఇక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగడమే కాకుండా అవసరమైన వైద్య పరికరాల తయారీ కూడా అమరావతి కేంద్రంగా జరగనుంది. ఈ ప్రాజెక్టు స్థాపనపై గత ఫిబ్రవరిలో విశాఖలో ఐయుఐహెచ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయు చేసుకుంది. దరిమిలా యుకె బృందం మార్చిలో అమరావతిని సందర్శించి ఆసుపత్రిని నెలకొల్పే ప్రాంతాన్ని పరిశీలించింది. ఇక్కడ ఏర్పాటు చేసే విశ్వవిద్యాలయం, ఇతర విభాగాలను యుకెలో ఉన్న ప్రపంచస్థాయి వైద్య కేంద్రంతో అనుసంధానం చేస్తారు.
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన వైద్యం మన దేశంలోనే లభించేలా ఆసుపత్రిని తీర్చిదిద్దుతారు. దేశంలో నెలకొల్పుతున్న 11 మెగా ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలకు యుకె ప్రభుత్వానికి చెందిన నేషనల్ హెల్త్ సర్వీసెస్ (ఎన్‌హెచ్‌ఎస్) ఐయుఐహెచ్‌కు భాగస్వామిగా ఉంటుంది. యుకెలో ప్రఖ్యాత ఎలరా క్యాపిటల్ ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చనుంది. అమరావతి ప్రాజెక్టుకు లండన్‌లో విఖ్యాత కింగ్స్ ఆసుపత్రి భాగస్వామిగా ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది బ్రిటన్ పర్యటించిన సందర్భంగా చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా ఐయుఐహెచ్ హెల్త్‌కేర్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. అమరావతి ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, నిర్మాణదారు ఎంపిక దాదాపు పూర్తయ్యింది. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఎపిఇడిబి) ద్వారా సంబంధిత వివరాలు ఎపి ఉన్నత విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖలకు ఇప్పటికే అందించారు.
ఇదిలావుంటే 25 నుంచి అమరావతిలో పర్యటించనున్న యుకె బృందం తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌తో సమావేశం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం కేటాయించనున్న 150 ఎకరాల స్థలంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. 26న అమరావతి ప్రాంతంలోని ఈ స్థలాన్ని యుకె బృందం సందర్శించి సిఆర్‌డిఎ అధికారులతో చర్చిస్తుంది. చివరగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో బృందం సభ్యులు సమావేశమవుతారు. బృందంలో ఐయుఐహెచ్ ఎండి, గ్రూపు సిఈవో అజయ్ రజన్ గుప్తా, ఐయుఐహెచ్ చైర్మన్ ప్రొఫెసర్ మైక్ పార్కర్, ఎలరా క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అవినాశ్ కాలియా, డిపార్టుమెంట్ ఆఫ్ ఎన్‌హెచ్‌ఎస్‌కు చెందిన మైక్ నితావ్రియానకిస్, కింగ్స్ హాస్పటల్ బోర్డు మెంబర్ వినయ్ సింఘాల్, ఇనె్వస్ట్ ఇండియా తరపున ఉదయ్ మంజల్, ఐయుఐహెచ్ ప్రతినిధి విక్టోరియా లూషర్ ఉన్నారు.