ఆంధ్రప్రదేశ్‌

సకాలంలో వర్షాలు కురుస్తాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఏప్రిల్ 21: రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి ఈ సంవత్సరం తెలుగు ప్రజలందరితోపాటు రైతులు సుఖ సంతోషాలతో ఉంటారని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరాపానందేంద్ర స్వామి వెల్లడించారు. గురువారం ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని హరిహరక్షేత్రం పదవ వార్షికోత్సవం సందర్భంగా స్వామి ముఖ్యఅతిథిగా పాల్గొని భక్తులనుద్దేశించి అభిభాషణ చేశారు. రాష్ట్రంలో లోకకల్యాణం కోసం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు కుటుంబ సభ్యులు పని చేస్తున్నారన్నారు. లోకకల్యాణం కోసం శిద్దా కుటుంబం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. రాష్ట్రంలోని తెలుగు ప్రజలందరు ఈసంవత్సరం సుఖసంతోషాలతో వర్ధిల్లుతారన్నారు. సకాలంలో వర్షాలు కురిసి రైతులందరు సంతోషంగా ఉంటారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ దేవాలయాలు నిర్మించాలన్న ముందుగా చీమకుర్తిలో శిద్దా కుటుంబం నిర్మించిన హరిహర క్షేత్రాన్ని సందర్శించాలన్నారు. హరిహరక్షేత్రం వార్షికోత్సవం సందర్భంగా మంత్రి శిద్దా రాఘవరావు, ఆయన సతీమణి లక్ష్మీపద్మావతి, వారి కుటుంబ సభ్యులను స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వదించారు. మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ హరిహరక్షేత్రం 10వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.