ఆంధ్రప్రదేశ్‌

ఎస్సీలకు రుణాల గడువు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌సిలకు 2015-16 సంవత్సరంలో ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను రెండు నెలల పాటు పొడిగించామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిశోర్‌బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ గడువు వాస్తవంగా 2016 మార్చి 31తో ముగిసిందన్నారు. అయితే సాంకేతిక కారణాల వల్ల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదని తెలిపారు. మే చివరి వరకు ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌సి కార్పొరేషన్‌కు రూ. వెయ్యి కోట్లు కేటాయించామని గుర్తు చేశారు.
హైదరాబాద్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట, రామంతాపూర్ క్యాంపస్‌లు)లలో గిరిజన శాఖ ఆర్థిక సాయంతో చదువుతున్న 30 మంది ఎపి విద్యార్థులను కడపలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు బదిలీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ విద్యార్థులకు భవిష్యత్తులో ‘స్థానికత’ సమస్య ఎదురవకుండా ఈ చర్య తీసుకున్నామన్నారు.