ఆంధ్రప్రదేశ్‌

బాలుడి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (క్రైం), ఏప్రిల్ 18: నాలుగు రోజుల క్రితం ట్యూషన్‌కు వెళ్లిన ఆరో తరగతి విద్యార్థి ఆదిత్యసాయిని కిడ్నాప్ చేసిన దుండగులు దారుణంగా హతమార్చారు. 15 లక్షల రూపాయలు కావాలంటూ తల్లిని డిమాండ్ చేసి.. వారి మధ్య చర్చలు విఫలం కావడంతో ప్రాణాలు తీసిన బాలుడిని ఫిరంగిపురంలోని సిరంగిపాలెం గ్రామ చెరువులో పడేశారు. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో తల్లి, అమ్మమ్మల చెంత పెరిగిన చిన్నారి గుంటూరు ఎటి అగ్రహారంలో శంతన్ పబ్లిక్ స్కూలులో చదువుతున్నాడు. ఈ నెల 14న సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లిన సాయి ఆరోజు రాత్రి ఇంటికి రాకపోవడంతో తల్లి జయకుమారి ఆ ప్రాంతమంతా వెతికింది. అదేరోజు రాత్రి నగరంపాలెం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలుడి అదృశ్యంపై కేసు నమోదు చేశారు. అయితే మరుసటి రోజు ఉదయం నుంచి జయకుమారి సెల్‌ఫోన్‌కు దుండగుల నుంచి కాల్ వచ్చింది. ఆదిత్యసాయిని తామే కిడ్నాప్ చేశామని, 15 లక్షలు చెల్లిస్తే క్షేమంగా వదిలిపెడతామంటూ బెదిరించారు. భర్త మృతి చెందటంతో కుట్టుమిషన్ ఆసరాతో జీవనం సాగిస్తున్న జయకుమారికి 15 లక్షలు ఎక్కడి నుంచి తేవాలో అర్థంకాక సమాచారాన్ని పోలీసులకు అందించింది. పోలీసులు నిందితుల ఫోన్‌కాల్స్‌ను ఛేదించే ప్రయత్నం చేసినా వారు రూపాయి కాయిన్ బాక్సు నుంచి ఫోన్ చేయడంతో కచ్చితమైన ఆచూకీ లభ్యం కాలేదు. 2 లక్షలు మాత్రం ఇవ్వగలనని జయకుమారి చెప్పడంతో ఆదివారం నుంచి ఫోన్‌కాల్స్ నిలిచిపోయాయి. సోమవారం ఉదయం సిరంగిపాలెం గ్రామ పరిధిలోని చెరువులో ఆదిత్యసాయి మృతదేహం లభ్యం కావడం కుటుంబ సభ్యులకు విషాదం మిగిల్చింది. పోలీసులు బాలుడు చదువుతున్న స్కూల్‌కు వెళ్లి ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులతో మాట్లాడారు. నిందితులకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. ఆదిత్యసాయిని చేతులు, కాళ్లు కట్టేసి, గొంతుకు తాడుబిగించి దుండగులు దారుణంగా హతమార్చటం చూపరులకు కంటతడి పెట్టించింది.