ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్భ్రావృద్ధి కోసమే టిడిపిలోకి: సుజయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), ఏప్రిల్ 18: రాష్ట్భ్రావృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు తాను టిడిపిలో చేరుతున్నానని బొబ్బిలి ఎమ్మెల్యే సజయ్‌కృష్ణా రంగారావు స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం రంగారావు తన సోదరుడు మాజీ మున్సిపల్ చైర్మన్ బేబీనాయనతో కలిసి విజయనగరంలో అశోక గజపతిరాజును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. 20వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో రాజధాని అమరావతిలో తనతో పాటు కలిసివచ్చే ప్రజాప్రతినిధులతో టిడిపిలో చేరుతున్నామని ఈ సందర్భంగా వారు చెప్పారు. పార్టీ సిద్ధాంతాలను గౌరవించి వచ్చే వారిని స్వాగతిస్తామని కేంద్రమంత్రి అశోక గజపతిరాజు అన్నారు. జిల్లా, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం సంతోషమని అన్నారు. అర్ధవంతమైన రీతిలో కలిసి పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించగలమనే నమ్మకం తమకు ఉందని చెప్పారు. వెనుకబడిన జిల్లాను అన్నిరంగాల్లో ముందుకు నడిపించడానికి టిడిపిలో తగిన అవకాశం ఉంటుందనే నమ్మకాన్ని బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణా రంగారావు వ్యక్తంచేశారు.