ఆంధ్రప్రదేశ్‌

నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 11: విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో ఖమ్మం జిల్లా మధిర వద్ద ఓ మహిళ మెడలో నుంచి దుండగుడు బంగారు గొలుసు తెంచుకెళ్లాడు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుఝామున జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. తెల్లవారుఝామున 4 గంటల సమయంలో మధిర మండల పరిధిలోని దెందుకూరు వంతెన వద్ద ఓ ఆగంతకుడు నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను చైన్ లాగి ఆపాడు. ఎస్ 4 బోగిలో కిటికీ పక్కన కూర్చొని నిద్రలోకి జారుకున్న దివ్యశ్రీ అనే మహిళ మెడలోని 20 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. ఉలిక్కిపడిన మహిళ దొంగతనం జరిగిందని గట్టిగా కేకలు వేయటంతో బోగీలోని ప్రయాణీకులంతా అదిరిపడి లేచారు. చుట్టుపక్కల వెతికినా ఎవరూ కనిపించలేదు. ఈలోపు రైలు కదిలిపోయింది. అయితే లైన్ క్లియర్ కాకపోవడంతో వెనుక వస్తున్న జిటి ఎక్స్‌ప్రెస్ కూడా చోరీ జరిగిన స్థలంలోనే నిలిచిపోయింది. ఆ రైలు వద్దకు కూడా దొంగలు వచ్చినట్లు గమనించిన ఎస్కార్ట్ కానిస్టేబుళ్లు గాలిలోకి కాల్పులు జరపడంతో ఆగంతకులు పరారయ్యారు.