ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారి పాదాలకు వెళ్లే రోడ్డు మార్గంలో ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, ఏప్రిల్ 11: తిరుమలలోని శ్రీవారి పాదాలకు వెళ్లే రోడ్డు మార్గంలో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. శ్రీవారి పాదాల నుంచి వేగంగా వస్తున్న ఓ ఇండికా వాహనం ఎదురుగా వస్తున్న సుమోను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇండికా వాహనంలో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన భాటియా (37) అనే భక్తుడి తలకు బలమైన గాయం కాగా, అతడి కుమార్తెకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదం సమాచారం తెలుసుకున్న టిటిడి రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్ సహాయంతో స్థానిక అశ్వని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.