ఆంధ్రప్రదేశ్
విద్యుత్ షాక్తో సైనికుడు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 5 April 2016
గుడిపాల, ఏప్రిల్ 4: ఆర్మీలో విధుల్లో ఉన్న సైనికుడు విద్యుదాఘాతంతో మృతి చెందగా ఆ జవాను మృతదేహం స్వగ్రామానికి సోమవారం చేరుకుంది. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పెరుమాళ్లకుప్పం గ్రామానికి చెందిన నందకుమార్(37) అనే యువకుడు జమ్ము కాశ్మీర్లో ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం ఉదయం ఏడు గంటల సమయంలో అతను విద్యుత్షాక్కు గురై మృతి చెందాడు. ఆ మృత దేహాన్ని ఆర్మీ అధికారులు ఆయన స్వగ్రామమైన పెరుమాళ్లకుప్పం గ్రామానికి సోమవారం ఉదయం తీసుకు వచ్చారు. సాయంత్రం ఆర్మీ అధికారుల లాంఛనాలతో అతనికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని మృతితో పెరుమాళ్లకుప్పం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.