ఆంధ్రప్రదేశ్‌

సిఆర్‌డిఏపై హైకోర్టులో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 28: రాజధాని నిర్మాణంలో తలమునకలై ఉన్న సిఆర్‌డిఏ మరోవైపు కేసులపై కేసులను ఎదుర్కోవాల్సి వస్తోంది. సోమవారం హైకోర్టులో ఒక కేసు దాఖలైంది. నెలకు లక్షా 20వేల రూపాయల జీతంపై వివిధ రంగాల్లో ప్రతిభావంతుడైన గుంటూరుకు చెందిన పత్రి వాసుదేవన్‌కు కమ్యూనికేషన్ విభాగంలో జెడి పోస్టు లభించింది. అన్నిరకాల పరీక్షలు, ఇంటర్వ్యూల అనంతరం ఈ నెల 8న నియామక పత్రం కూడా అందజేశారు. దీనికి అంగీకార పత్రం అందించిన వాసుదేవన్ తాను ఈ నెల 28న విధుల్లో చేరనున్నట్లు సిఆర్‌డిఏకు తెలియజేశారు. అయితే ఇంతలో ఆయనకు పిడుగు లాంటి సమాచారం అందింది. ఈ నెల 19న ముందుగా సిఆర్‌డిఏ నుంచి ఫోన్‌కాల్, ఆపై మెయిల్ మెసేజ్ చేరాయి. ‘మీకు ఇచ్చిన ఆఫర్‌ను రద్దు చేసున్నాం’ అని దాని సారాంశం. ఇంకేముంది వాసుదేవన్ ఆగమేఘాలపై ఇక్కడకు చేరుకుని ఎవరిని ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదు. అవాక్కయి తగిన న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్‌ను స్వీకరించింది.