ఆంధ్రప్రదేశ్
గవర్నర్తో ఈసీ భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 17 March 2020
విజయవాడ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అర్థంతరంగా వాయిదా వేయటంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్కుమార్ సోమవారం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. 40నిమిషాల పాటు ఆయనతో చర్చించారు. అయితే చర్చల వివరాలేవీ అధికారికంగా వెలువడలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకా రం స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో ఎన్నికల ప్రధానాధికారి రమేష్కుమార్ గవర్నర్ హరిచందన్కు వివరించినట్లు తెలిసింది.