ఆంధ్రప్రదేశ్‌

ఏ రోజు లెక్క ఆరోజే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయంలో 13 జిల్లాల వ్యయ పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశీలకులు తమ విధిని నిర్వర్తించడంలో తటస్థంగా మరియు నిష్పాక్షికంగా ఉండాలన్నారు. వెంటనే జిల్లాల్లో విధుల్లో చేరి బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రతినిధిగా విధులు నిర్వహించాలని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు అన్ని సమయాల్లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ఫిర్యాదులను పరిష్కరించడానికి పరిశీలకులు చురుకుగా వ్యవహరించాల్సి ఉందన్నారు. పరిశీలకులు ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేసేలా చూడాల్సి ఉందన్నారు. అభ్యర్థుల ద్వారా ఎన్నికల్లో చేసే ఖర్చులపై పర్యవేక్షణ, దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చులతోపాటు సున్నితమైన ప్రదేశాలను గుర్తించి వాటిపై నిశితంగా దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఎన్నికల్లో డబ్బు పాత్రను అరికట్టడానికి ప్రచార వ్యవధిలో ఎన్నికల వ్యయ ఖాతాలను తరచుగా తనిఖీ చేయడానికి, పరిశీలించడానికి, యంత్రాంగాన్ని సమర్థవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్‌లతో సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందన్నారు. వివాహ, కుటుంబ వేడుకలు, వైద్య చికిత్స, ఫీజు చెల్లింపు, ఏవైనా వ్యక్తిగత కారణాల వల్ల నిర్దేశించిన పరిమితి రూ. 50 వేలు కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్లినందుకు సాధారణ ప్రజలను వేధిస్తున్నారనే విమర్శలకు అవకాశం ఇవ్వకూడదని ఆయన తెలిపారు. ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చులను గతంలో ఉన్న వ్యయ పరిధి కంటే రెండింతలు పెంచినట్లు తెలిపారు. వ్యయ పరిశీలకులు వీలైనన్ని ఎక్కువ శిక్షణా కేంద్రాలకు హాజరుకావాలని, క్షేత్ర స్థాయిలో విధుల్లో పాల్గొనే సిబ్బందికి, అధికారులకు తగిన సూచనలు చేయాల్సి ఉందన్నారు.
ఓటరు సౌలభ్యానికి ఎటువంటి అవాంతరాలు లేకుండా తరచుగా తనిఖీ చేయడానికి పోలింగ్ కేంద్రాలను సందర్శించాల్సిందిగా పేర్కొన్నారు. కనీస ప్రాథమిక సదుపాయాలు, సీనియర్ సిటిజన్లకు సదుపాయం, వైకల్యంతో బాధపడుతున్నవారు, మహిళలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించే దిశలో దృష్టి సారించాల్సి ఉందన్నారు. అందరినీ కలుపుకుని ఎన్నికల మార్గదర్శకాలు, కమిషన్ నిబద్ధతను నిర్ధారించడానికి విధులను నిర్వర్తించాల్సి ఉందన్నారు. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల పరిశీలకులు సహించరు అన్న సందేశం క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సిందేనని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ కార్యదర్శి ఎస్ రామసుందరరెడ్డి, 13 జిల్లాల ఎన్నికల వ్యయ పరిశీలకులు పాల్గొన్నారు.