ఆంధ్రప్రదేశ్
మహిళా సాధికారతే లక్ష్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 9 March 2020
![](http://ftp.andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/9p2_23.jpg?itok=xbLesTYZ)
అమరావతి: మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ట్విట్టర్ వేదికగా ఆయన తెలుగింటి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందిననాడే దేశ ప్రగతి సాధ్యపడుతుందన్నారు. అమ్మఒడి నుంచి పేదలకు ఇళ్లపట్టాల వరకు ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకం మహిళా సాధికారతకు దోహదపడటం ఆనందంగా ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు.
*చిత్రం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి