ఆంధ్రప్రదేశ్‌

అమరావతి, ఇంధన శాఖ మీడియా సలహాదారుగా చంద్రశేఖర రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: రాష్ట్ర ఇంధన సంరక్షణ సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఏపి ట్రాన్స్‌కో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ చంద్రశేఖర రెడ్డిని మీడియా సలహాదారుగా నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి రాజధాని ప్రాంతం (సిఆర్‌డిఏ), వౌలిక సదుపాయాలు, ఇంధనం, పెట్టుబడులు, ఫైబర్‌నెట్, పోర్టులు, ఎయిర్ పోర్టులు, గ్యాస్ తదితర శాఖల మీడియా సలహాదారుగా ఆయన విధులు నిర్వహిస్తారు. ఇంధన శాఖలో సిఇవోగా పనిచేస్తున్న ఆయన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసస్ లిమిటెడ్ సహకారంతో రాష్ట్రంలో ఎల్‌ఇడి బల్బుల పంపిణీ పెద్ద ఎత్తున జరిగే విధంగా కృషి చేశారు. అంతర్జాతీయ పెట్టుబడులకు అమరావతి నగరం కేంద్రంగా మారనున్న కీలక తరుణంలో జాతీయ, అంతర్జాతీయ నగరంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉందని చంద్రశేఖర రెడ్డి తెలిపారు. దేశీయ సంస్కృతి, సంప్రదాయాలు వంటి అంశాలను ప్రపంచానికి పరిచయం చేయాల్సి ఉందని ఆయన చెప్పారు.