ఆంధ్రప్రదేశ్‌

‘పోలవరం’ పనులు పరిశీలించిన సీడబ్ల్యూసీ డైరెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, డిసెంబర్ 4: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సీడబ్ల్యూసీ డైరెక్టర్ కమల్‌కుమార్ బుధవారం పరిశీలించారు. సీడబ్ల్యూసీ డైరెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలిసారిగా ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలించడానికి ఇక్కడకు వచ్చారు. జంట సొరంగాలు, రెగ్యులేటర్, గేట్ల తయారీ కేంద్రంతో పాటు స్పిల్‌వే, కాఫర్ డ్యాం నిర్మాణ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. తూర్పు గోదావరి జిల్లాలో పవర్ ప్లాంటు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి, పరిశీలించారు. ప్రాజెక్టు ఎస్‌ఈ నాగిరెడ్డి నిర్మాణాలను మ్యాప్ ద్వారా కమల్‌కుమార్‌కు వివరించారు. ఆయన వెంట సీడబ్ల్యూసీ డిప్యూటీ డైరెక్టర్ అశ్వనీకుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ ఈఈలు, డీఈలు ఉన్నారు.
*చిత్రం... కాఫర్ డ్యాం నిర్మాణ ప్రాంతంవద్ద మ్యాప్‌ను పరిశీలిస్తున్న సీడబ్ల్యూసీ డైరెక్టర్ కమల్‌కుమార్