ఆంధ్రప్రదేశ్‌

వైసీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), డిసెంబర్ 4: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చిన ఘనత జగన్‌కే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఒకవైపు అమ్మఒడి పథకం అంటూనే మరోవైపు వైసీపీ బడులు నడుపుతున్నారని బుధవారం ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. వైకాపా జెండా ఎత్తమంటూ ముక్కుపచ్చలారని పిల్లలతో ఆటలు ఆడించారన్నారు. రాయలసీమ ముద్దబిడ్డ మన జగనన్న అంటూ విద్యార్థులతో పాడించడం దారుణమన్నారు. ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాలలో ఈ సిగ్గుమాలిన పనులు ఏమిటంటూ ఆయన ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి సాక్షిగా విద్యాలయాన్ని విషప్రచార నిలయం చేశారన్నారు. మొన్న ఓ తహసీల్దార్ తాగేసి మన జగనన్న అంటూ గెంతులేస్తే, నిన్న వందలాది మంది గిరిజన విద్యార్థులతో వైకాపా ప్రచార గీతాలకు స్టెప్పులు వేయించారన్నారు.
ఆర్భాటాలకు నిధులెక్కడివి?
ఒకవైపు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి నిధులు లేవని దొంగ ఏడుపులు ఏడుస్తున్న జగన్ మరోవైపు మాత్రం వైసీపీ కార్యకర్తలైన వలంటీర్లకు సెల్‌ఫోన్లు కొనడానికి ప్రజాధనాన్ని భారీగా ఖర్చు చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. గ్రామ వలంటీర్లుగా పేరుమార్చిన వైకాపా కార్యకర్తల కోసం ఫోన్లు కొని రివర్స్ టెండర్‌లో రూ.83కోట్లు ఆదా అంటూ చెవిలో క్యాబేజీ పెట్టారన్నారు. ప్రభుత్వం పిలిచిన రెండు టెండర్లలో ఒకే కంపెనీ దాఖలు చేసిందన్నారు. ఈ స్కీంలో రూ. 233 కోట్ల ప్రజాధనానికి జగన్ టెండర్ పెట్టడం తప్ప, రివర్స్ టెండరింగ్ ఎక్కడుందో చెప్పాలన్నారు. 100 కోట్లు దాటిన టెంటర్లకు జ్యుడీషియల్ ప్రివ్యూ ఉంటుందన్న జగన్ మరి ఫోన్ల టెండర్లను ప్రివ్యూకు ఎందుకు పంపలేదన్నారు. జే-ట్యాక్స్ కడితే ప్రివ్యూ ఉండదా అంటూ ట్విట్టర్‌లో లోకేష్ ప్రశ్నించారు.