ఆంధ్రప్రదేశ్‌

అవంతీ..నోరు అదుపులో పెట్టుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 13: రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్న అవంతి శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకోకుంటే టీడీపీ కార్యకర్తలు తగిన బుద్ధిచెప్తారని శాసనమండలి సభ్యుడు, టీడీపీ నేత మంతెన సత్యనారాయణ రాజు హెచ్చరించారు. ఈ మేరకు గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మోసం, దగా, వంచనకు మారుపేరు అవంతి అని, ఆయనకు పబ్లిసిటీ జబ్బు చేసిందని, అందుకే తన మంత్రి పదవి కాపాడుకునేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై దిగజారుడు విమర్శలు చేస్తున్నారన్నారు. విశాఖలో చంద్రబాబు పర్యటనకు ప్రజల నుండి వచ్చిన అనూహ్య స్పందన చూసి అవంతి శ్రీనివాస్‌కు మతిభ్రమించిందన్నారు. మంత్రి పదవి చేపట్టిన నాలుగు నెలల కాలంలో విశాఖ జిల్లాకు ఏం చేశారో చెప్పలేని నిస్సహాయ స్థితిలో అవంతి ఉన్నారన్నారు. 100 మంది అవంతి శ్రీనివాస్‌లు, 1000 మంది జగన్‌లు వచ్చినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరన్నారు.