ఆంధ్రప్రదేశ్‌

గాలిలో కాల్పులు ఆత్మశాంతినిస్తాయా?: గోరంట్ల విసుర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 18: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తీవ్ర మానసిక క్షోభకు గురిచేసి ఆనక అధికారిక లాంచనాలంటూ గాలిలోకి పోలీసులచే కాల్పులు జరిపిస్తే కోడెల ఆత్మకు శాంతి చేకూరుతుందా అని టీడీఎల్పీ ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన జీవించి ఉన్నప్పుడు మానసిక ఒత్తిడికి గురిచేసి, వేధింపులు, సాధింపులతో బలవన్మరణానికి గురయ్యేలా చేసి చివరకు స్వర్గపురిలో మీ లాంచనాలెందుకంటూ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అధికారిక లాంచనాలతో కోడెల ప్రసాదరావుకు అంత్యక్రియలు జరిపిస్తామని ప్రకటించడంపై బుచ్చయ్య చౌదరి తీవ్రంగా స్పందించారు. బుధవారం నర్సరావుపేటలో కోడెల అంత్యక్రియలు ముగిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. కోడెలతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని, ఆయన ఏ శాఖ చేపట్టినా పూర్తి అవగాహనతో వనె్న తెచ్చేవారని అన్నారు.