ఆంధ్రప్రదేశ్‌

‘అసత్యాల ప్రచారానికే యువభేరి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4: విద్యార్ధులతో సదస్సులు నిర్వహించే అర్హత జగన్మోహన్‌రెడ్డికి లేదని ఏపి ఉమెన్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. 11 కేసుల్లో ఎ-1గా ఉండి జగన్మోహన్‌రెడ్డి ఏ విధంగా విద్యార్థులతో సమావేశం అవుతారని ఆమె ప్రశ్నించారు. రెండేళ్లలో లోటు బడ్జెట్ ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు, ఉపాధి కల్పించారని, వైఎస్ పాలనలో 11 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని అన్నారు. చంద్రబాబు పాలనలో 9 డిఎస్సీలు జరిపి లక్షా 70 వేల మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చారు. ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని చెప్పి కేవలం రెండు డిఎస్సీలు మాత్రమే నిర్వహించారని అనురాధ పేర్కొన్నారు. వైఎస్ ఉద్యోగాలు తుంచితే, చంద్రబాబు ఉద్యోగాలు పెంచారని, పచ్చి అబద్దాలతో జగన్ వాస్తవాలను తారుమారు చేయలేరని అన్నారు. జగన్ అభివృద్ధి నిరోధక చర్యలను, కుట్రలను, దుష్ప్రచారాన్ని యువత తిప్పికొట్టాలని అన్నారు.