ఆంధ్రప్రదేశ్‌

సిఆర్‌డిఏ కమిషనర్‌గా శ్రీధర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 27: రాష్ట్రంలో పలువురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపి ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సిఆర్‌డిఏ) కమిషనర్‌గా పనిచేస్తున్న నాగులాపల్లి శ్రీకాంత్‌ను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్యదర్శి(పొలిటికల్)లో నియమించింది. శ్రీకాంత్ స్థానంలో గుంటూరు జాయింట్ కలెక్టర్ డాక్టర్ సి శ్రీ్ధర్‌ను నియమించింది. అలాగే విజయనగరం జిల్లా కలెక్టర్ మధువత్ ఎం నాయక్‌ను ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సిఎండిగా నియమించింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ వివేక్ నాయక్‌ను విజయనగరం జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.