ఆంధ్రప్రదేశ్‌

ఆలయాల కూల్చివేత హిందూమతాన్ని కించపరచడమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, జూలై 3 : విదేశీయుల మాటలు విని విజయవాడలోని దేవాలయాలను కూల్చివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టడం హిందూ మతాన్ని కించపరచడమే అని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రఘువీరా ఆదివారం అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో విలేఖరులతో మాట్లాడారు. విజయవాడలో దేవాలయాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంతో హిందువులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. విదేశీయుల మెప్పు కోసం చంద్రబాబు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ప్రజలు తిరగబడుతున్నారన్నారు. దేవాలయాల కూల్చివేత నేపథ్యంలో మఠాధిపతులు, పీఠాధిపతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శాంతిని కోరుకునే స్వామిజీలు నిరసనలు తెలియజేయడం రాష్ట్రానికి మంచిది కాదన్నారు. ఇక రెండేళ్ల టిడిపి పాలనలో ఆంధ్ర రాష్ట్రం అవినీతిలో దేశంలోనే నెంబర్ వన్‌గా మారిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రభుత్వానికి రహస్య కోశాధికారిగా ఉంటూ అవినీతిని ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. అవినీతికి పాల్పడిన వారితో పాటు సిఎం చంద్రబాబు కూడా జైలుపాలు కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో గత కాంగ్రెస్ హయాంలో పాల ఉత్పత్తిని పెంచడానికి చర్యలు తీసుకుని ప్రభుత్వ డెయిరీలను బలోపేతం చేసినట్లు గుర్తుచేశారు. గోదావరి పుష్కరాల్లో రూ. 1600 కోట్ల అవినీతికి పాల్పడి భక్తులకు సౌకర్యాలు కల్పించకపోవడంతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 27 మంది మృత్యువాతపడ్డారని విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కృష్ణా పుష్కరాల సమయం సమీపిస్తున్నా భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పుష్కరాల పేర నిధులను దోచుకోవడానికి, ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు పాల్పడుతున్నారన్నారు.

చిత్రం.. అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి