ఆంధ్రప్రదేశ్‌

సదావర్తి భూములపై అనవసర రాద్ధాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 30 : గుంటూరు జిల్లా అమరావతిలోని అమరేశ్వరుని దేవస్థానానికి అనుంబంధంగా ఉన్న చెన్నైలోని సదావర్తి సత్రం భూములను కారు చౌకగా వేలంలో కొంతమంది దక్కించుకున్నారంటూ వైకాపా నేతలు వివాదాస్పదం చేస్తున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ సిహెచ్.రామానుజయ ఆరోపించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆ సత్రానికి చెందిన 83 ఎకరాలను వేలం వేసిందని గుర్తు చేశారు. విశాఖలో విలేఖరుల సమావేశంలో గురువారం మాట్లాడుతూ సత్రానికి దాదాపు 450 ఎకరాలు ఉండగా, అందులో ఆక్రమణలకు గురి కాగా, ప్రస్తుతం 83 ఎకరాలు ఉన్నట్లు దేవాదాయ శాఖ గుర్తించిందన్నారు. ఇవి కూడా ఆక్రమణలకు గురి అయ్యాయని గుర్తు చేశారు. తన కొడుకు కూడా కొంత భూమిని వేలంలో దక్కించుకున్నారని తెలిపారు. వైకాపా నేతలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇటువంటి అంశాలపై రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు.