ఆంధ్రప్రదేశ్‌

గ్రేహౌండ్స్ కమాండర్‌గా సెంథిల్ కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా ఎస్ సెంథిల్ కుమార్‌ను అదే పోస్టులో కొనసాగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరో బెటాలియన్ ఎపిఎస్‌పి కమాండెంట్‌గా గోపినాథ్ జెట్టిని కొనసాగిస్తూ మరో ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్రంలోని ఏడు స్పెషల్ సిఎస్ పోస్టులను ఏడాది పాటు కొనసాగిస్తూ మరో రెండు ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఎపి భవన్ స్పెషల్ కమిషనర్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ సిఎస్, ల్యాండ్ రెవిన్యూ స్పెషల్ సిఎస్, టిటిడి ఇఓ, సిఎం కార్యాలయ స్పెషల్ సిఎస్, వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్, టిఆర్ అండ్ బి స్పెషల్ సిఎస్ పోస్టులు కొనసాగుతాయి.