ఆంధ్రప్రదేశ్‌

రెండు అన్న క్యాంటీన్లు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తక్కువ ధరలకే ఫలహారాలు, భోజనం అందించేందుకు నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో రెండు అన్న క్యాంటీన్లను శనివారం ప్రారంభించారు. వెలగపూడి వద్ద సిఎం చంద్రబాబు, మల్కాపురం వద్ద మంత్రి పరిటాల సునీత వీటిని లాంఛనంగా ప్రారంభించారు. ఒక్కో క్యాంటీన్‌లో రోజుకు 400 మంది వరకూ ఫలహారాలు, భోజనాలను అందజేస్తారు. అమరావతిలో మరో రెండు క్యాంటీన్లను కొద్దిరోజుల్లో ప్రారంభిస్తామని మంత్రి సునీత తెలిపారు. రాయలసీమకు చెందిన రాగిసంకటిని కూడా ఈ క్యాంటీన్లలో అందజేస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అన్న క్యాంటీన్లను ప్రారంభించే యోచన ఉందన్నారు.