ఆంధ్రప్రదేశ్
విజయవాడలో కల్తీ మద్యం సేవించి ఏడుగురు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 7 December 2015
విజయవాడ : విజయవాడలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. కృష్ణలంకలో నిర్వహిస్తున్న వైన్షాపులో మద్యం తాగిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఏడుగురు మృతిచెందగా... 20 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కల్తీ మద్యం ఘటనపై ఆగ్రహించిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ...ప్రభుత్వ ఆస్పత్రిలో సందర్శించి సంఘటనపై ఆరా తీశారు. ఎక్సైజ్ అధికారులు మద్యం శాంపిల్స్ను సేకరించి బార్ను సీజ్ చేశారు.