ఆంధ్రప్రదేశ్‌

పోలీసులు వేధించారని ఆరుగురి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఓ కేసు సందర్భంగా తరచూ పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తూ తమను వన్‌టౌన్ ఎస్‌ఐ, ఓ కానిస్టేబుల్ వేధిస్తున్నారని ఆరుగురు వ్యక్తులు ఆత్మహత్యకు యత్నించిన ఘటన గురువారం గుడివాడలో జరిగింది. రెండు కుటుంబాలకు చెందిన నాగమణి, షేక్ రహీం అనే వ్యక్తులను పోలీసులు తరచూ పిలిపించుకుని విచారణ చేస్తున్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ తీరుకు నిరసనగా నాగమణి, ఆమె ఇద్దరు కూతుళ్లు, కుమారుడు, భార్యతో పాటు రహీం గురువారం ఆత్మహత్యకు యత్నించారు. వీరంతా గుడివాడ మున్సిపల్ కార్యాలయం భవనం పైకి ఎక్కి కిందకు దూకుతామని బెదిరించారు. స్థానిక టిడిపి నేత జోక్యం చేసుకుని వీరిని కిందకు రప్పించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆత్మహత్యకు యత్నించిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.