S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Others
హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు అన్న తేడా లేకుండా ఎవరిమీదైనా పంచ్లు వేసే ధైర్యం ఎవరికుంది? అంటే కచ్చితమైన సమాధానం ఎవరైనా చెప్పేది ఒక్కటే. అదే సమంత. సమంతకున్న ధైర్యం ఎవరికీ లేదేమో. గతంలో హీరోలపైనే పంచ్లు వేసేసిన ఆమె తాజాగా తనతోటి హీరోయిన్లకు పంచ్ వేసింది. హీరోయిన్లందరూ తమ తల్లులతో సెట్స్పైకి వస్తారని, అలాంటిది తనకిష్టం వుండదని చెప్పుకొచ్చింది. ఒకరి సహాయం ఎందుకు?
గతంలో సినిమా దర్శకుడిని -కెప్టెన్ ఆఫ్ ది షిప్తో పోల్చేవారు. నౌకలు నెలల తరబడి సముద్రంలో ప్రయాణం చేస్తాయి. నౌకలో ప్రయాణిస్తున్న వందలాది ప్రయాణికులు, వేలాది టన్నుల సరుకుని సురక్షితంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కెప్టెన్దే. అదేవిధంగా ఒక సినిమా నిర్మాణం పూర్తకావాలంటే మొత్తం 24 విభాగాలకు చెందినవారు సమన్వయంతో పనిచేయాలి. వీరందరూ సమష్టిగా పనిచేయడం వల్లనే చిత్ర నిర్మాణం పూర్తవుతుంది.
జీవిత భాగస్వామిని నిర్ణయించుకొనే సమయంలో ఒకే రంగంలోని యువతీ యువకులు ఇంటివారైతే -చేస్తున్న వృత్తిలోని సాధక బాధకాలు ప్రత్యక్షంగా అర్థం చేసుకుని నిండైన జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెలుగు సినిమా రంగానికి వస్తే స్వర్ణయుగం నుంచే సినిమా దంపతులను చూస్తున్నాం.
హంసానందిని రొట్టె విరిగి ఐటెమ్లో పడినట్టుంది. ఐటెమ్ పెర్ఫారెన్స్లో హాటు’దేరిపోయిన హంసకు -వరుసపెట్టి హాట్హాట్ ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా అల్లు శిరీష్తో పరశురామ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో ఐటెమ్ సాంగ్కు ఓకె చెప్పిందని అంటున్నారు. అందుకు బోనస్గా ఆమెతో చిన్న పాత్ర కూడా చేయిస్తున్నట్టు వినికిడి.
పదేళ్ల క్రితం హీరోయిన్గా వెలుగు వెలిగిన ప్రీతిజింతా పెళ్లి మాట ఎత్తకుండా ఇన్నాళ్లు వ్యాపార రంగంలో మునిగిపోయింది. నెస్వాడియాతో ప్రేమలో మునిగిపోయిన ఈ అమ్మడు ఆయనే్న పెళ్లిచేసుకుంటానని చెప్పినా ఆ తర్వాత బ్రేకప్ ఇచ్చింది. వ్యాపారంలో ఒడుదుడుకులు చవిచూసే సమయంలో ఇక పెళ్లిచేసుకోదేమో అనుకున్న సమయంలో తాజాగా ఓ వార్తని ప్రకటించింది. ఓ అమెరికా వ్యక్తితో తాను ప్రేమలో ఉన్నట్లుగా తెలిపింది.
ఈవారం కూడా బాక్సాఫీస్ భోరుమంది. సరైన కథనాల్లేని చిత్రాలు తెలుగు తెరపై దాడిచేసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రవితేజ హీరోగా సంపత్నంది దర్శకత్వంలో రూపొందిన ‘బెంగాల్ టైగర్’ ఈ వారం విడుదలైంది. జగపతిబాబు హీరోగా చాలాకాలం క్రితం తయారైన ‘హితుడు’ థియేటర్లకు వచ్చింది.
సౌత్ క్రేజీ హీరోయిన్ పలు సంచలనాల హీరోయిన్గా మంచి క్రేజ్ తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉంది. ఇప్పటికే స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈమె ఈమధ్య ఏ ఒక్క తెలుగు సినిమాలోనూ నటించలేదు. లేటెస్ట్గా వెంకటేష్, మారుతి కలయికలో రూపొందే సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈమధ్య ఈ అమ్మడికి వరుస అవకాశాలు బాగా పెరగడంతో ఇప్పుడు మళ్లీ భక్తిరస చిత్రాలవైపు ఆసక్తి చూపిస్తోందట!
వెండితెరపై ‘జూలి’ పేరుకు ఓ ప్రత్యేకత వుంది. ఈ పేరుతో రూపొందిన సినిమాలు సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు మరోసారి అదే పేరుతో ఓ సినిమా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళ, తెలుగు భాషల్లో గ్లామర్ పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటున్న అందాల భామ లక్ష్మీరాయ్ ప్రస్తుతం పవన్ సరసన సర్దార్ గబ్బర్సింగ్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఒక్క చిత్రం కూడా విడుదల కాలేదు. తెలుగు పరిశ్రమ గురించి ఏ మాత్రం అవగాహన వుందో ఎవరికీ తెలియదు. కానీ, అన్నీ తెలిసినట్లుగా చిలక పలుకులు పలికేస్తోంది మల్లు బ్యూటీ కీర్తి సురేష్. ఇటీవలే తెలుగులో రెండు చిత్రాలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన కీర్తి, తెలుగు పరిశ్రమ గురించి అన్ని నిజాలు చెప్పేస్తోంది. అది పొగడ్తగా చెబుతోందో, తిడుతూ చెబుతుందో వినేవారికి ఏమీ అర్థం కావడంలేదు.
‘ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, చక్కని పాపను ఇక్కడుంచారు’. ఆంధ్రప్రదేశమంతటా పవిత్ర దేవతలను నిక్షిప్తం చేసుకుని, వారినందరినీ పాపకు రక్షణగా ఉండండి అని పాడే ప్రార్థనాగీతం ఇది. ‘బావమరదళ్ల’లో ఈ పాట నాకు నచ్చింది. సింహాచలేశా అని బాలప్రహ్లాదుడు అని సింహాచలంలో అప్పలనరసింహం స్వామివారిని, నెల్లూరు సంబంధాన్ని శ్రీరంగనాయకా ఆనందనాయకా అని చెప్పిన తీరు నచ్చింది.