S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Others
సంగీతపరంగా, సాహిత్యపరంగా ఈ పాట ఇష్టపడని వారుండరు. అందులో నేనూ ఒకడిని. ఏఎన్నార్, సావిత్ర నటించిన డాక్టర్ చక్రవర్తి సినిమా కోసం ఆత్రేయ వారు అలతి లలతి పదాలతో అద్భుతాన్ని ఆవిష్కరిస్తే.. సుస్వరాల రాజేశ్వర రావు దానికి బాణీకట్టి మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. గంధర్వ గాత్రంతో సుశీల పాటకు ప్రాణం పోస్తే, మహానటి సావిత్రి తన అభినయంతో పరిపూర్ణత సమకూర్చారు.
జెమిని సినిమాతో యువతను గిలిగింతలు పెట్టిన నమిత గుర్తుంది కదా! తరువాత ‘సింగమంటి చిన్నోడు వేటకొచ్చాడే’ అంటూ సాగిన పాట కూడా గుర్తుతెచ్చుకోండి. కానీ, మొదటి నమిత వేరు. రెండో నమిత వేరు. మొదటి చిత్రంలో అందంతో ఆకట్టుకుంటే, తురువాతి చిత్రాల్లో ఎక్స్పోజ్తో పడగొట్టేసింది. నమితవుంటే చాలు, సినిమా నిండుగా కనిపిస్తుంది అనుకొని ఆమెకు అవకాశాలు బాగానే ఇచ్చారు. ఆ తరువాతే..
మహానటుడు నందమూరి తారక రామారావు మేన బావమరిది యు విశే్వశ్వరరావు విశ్వశాంతి ప్రొడక్షన్స్ పతాకంపై కంచుకోట (1967), నిలువుదోపిడి (1968), పెత్తందార్లు (1970), దేశోద్ధారకులు (1973) చిత్రాలు నిర్మించారు. సూపర్ డూపర్ హిట్ సాధించిన నాలుగు చిత్రాల కథాంశాలలో అంతర్లీనంగా రాజకీయాలతోపాటు సందేశం కూడా ఉంటుంది.
అవకాశాలు వెల్లువలా వళ్లోవచ్చి వాలుతుంటే ఒక్క ఛాన్స్ మిస్సయినా ఏముంది? అని దీర్ఘంగా నిట్టూరుస్తోంది రకుల్ ప్రీత్సింగ్. తాజాగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిస్తున్న ఓ చిత్రంలో కథానాయికగా ఆమె నటిస్తోందని ప్రకటన వచ్చింది. పారితోషికాన్ని పెంచి మరీ ఆ చిత్రంలో చేయడానికి సిద్ధమైందట. దీంతో దర్శక, నిర్మాతలు అంత భారీ పారితోషికాన్ని చూసి వెనక్కి తగ్గారట.
* బాగోలేదు
నన్ను వదలి నీవు పోలేవులే!
తారాగణం: కోలా బాలకృష్ణ, వామిక, పార్వతీ నాయర్ తదితరులు
సంగీతం: అమృత్,
నిర్మాత: కోలా భాస్కర్,
కథ, స్క్రీన్ప్లే, మాటలు: శ్రీరాఘవ,
దర్శకత్వం: గీతాంజలీ శ్రీరాఘవ
--
గబ్బర్సింగ్ చిత్రంతో ఐటెమ్ సాంగ్తో కెవ్వు కేక అనిపించిన మలైకా అరోరా ఖాన్ను తెలుగు ప్రేక్షకులు త్వరగా మర్చిపోలేరు. హిందీలో, తెలుగు, తమిళం.. ఇలా ప్రాంతాల ప్రేక్షకులనూ ఐటెమ్స్తో అలరించింది మలైకా. కండల వీరుడు సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ను పెళ్లి చేసుకుని విడిపోయిన తరువాత -తెరమీదకొచ్చి కెవ్వు కేక అనిపించిన విషయం తెలిసిందే.
హీరోయిన్ కడుపున హీరోయిన్ పుడుతుందేమో అన్నట్లుగా మీనా కూతురు నైనిక ఇపుడు బాలనటిగా తమిళ తెరపై దర్శనం ఇవ్వబోతోంది. మీనా కూడా మొదట్లో బాలనటిగానే తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత సీతారామయ్యగారి మనవరాలుతో కెరీర్ టర్న్ అయి పెద్ద హీరోయిన్గా మారి సూపర్స్టార్లందరి సరసనా నటించి శభాష్ అనిపించుకుంది. ఇపుడు అదే దారిలో మీనా కూతురు నైనిక కూడా సాగుతోంది.
1934లో నిర్మించిన తొలి తెలుగు స్టూడియో -వేల్ పిక్చర్స్. విఎల్ నరసు దాన్నికొని, నరసూ స్టూడియోస్గా మార్చి ఆ బ్యానర్పై నిర్మించిన తొలి చిత్రం -్భలే రాముడు. 1943లో బాంబే టాకీస్ పతాకంపై, అశోక్కుమార్, ముంతాజ్ శాంతి కాంబినేషన్లో గ్యాన్ ముఖర్జీ కథ, దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం -కిస్మత్. ఈ చిత్రం కలకత్తాలో ఒకే థియేటర్లో మూడేళ్లు ప్రదర్శింపబడింది.
ముందుంది పెద్ద సినిమాల పండుగ. అందుకే సందు చూసుకుని చిన్న చితకా సినిమాలు, మీడియం సినిమాలు ఈవారం బాక్సాఫీస్ దగ్గర క్యూ కట్టేశాయ. ఒక్క సినిమా వచ్చి హిట్ అయ్యిందీ అంటే దాని అదృష్టం ఏంటోగానీ ఆ తర్వాత వచ్చే చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర నీరుగారిపోతున్న చిత్రం చిత్ర పరిశ్రమలో కొద్ది వారాలుగా కనిపిస్తోంది. ఈవారమూ అదే విషయం స్పష్టమైంది.
ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చాం అన్నది ముఖ్యం కాదు. ఎలాంటి పాత్రలు వేశాం అన్నదే ముఖ్యం అని ఇన్నాళ్ళూ భీష్మించుకు కూర్చున్న శ్రద్ధాకపూర్, ఇప్పుడు తన సూత్రాన్ని తానే మార్చేసుకుంటోంది. ఆమె పరిశ్రమకు వచ్చి దాదాపుగా ఏడెనిమిదేళ్ళు కావస్తోంది. అయినా కానీ కెరీర్ పరంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది. రెండు మూడు హిట్స్ మాత్రం ఆమె ఖాతాలో వున్నాయి. అంతకు తప్పితే మరేమీ లేదు.