S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వెలుతురు ఎక్కువైతే వ్యాధుల బెడద

ఫ్రశ్న: టీవీ తెరలు, సినిమాలు, కంప్యూటర్లు వీటి వలన కంటికి మాత్రమే హాని కలుగుతుందా? అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందా?

-గుండు ప్రసాదరావు (జగిత్యాల)

జ: భగవంతుడనండీ, ప్రకృతి అనండీ, పేరు తెలియని ప్రేరక శక్తి అనండీ.. ఏది నియంత్రిస్తున్నా ఈ సృష్టి ఒక నియతి ప్రకారం నడుస్తోంది. దాన్ని మనం పాటించాలి. పగలు సూర్యుడి కాంతి ఉన్నంతసేపూ మన కళ్లు పనిపాటల్లోనే ఉండాలి. రాత్రి చీకటి పడ్డాక కళ్లకు ఇంక పని ఉండకూడదు. ఇది నియతి! ఈ సూత్రానికి అనుగుణంగా శరీరంలో ఓ గడియారం రూపొంది శరీర ధర్మాలకు సమయపాలన చేస్తుంటుంది.
పొద్దున 8 అయ్యేసరికి బ్రేక్‌‘్ఫస్ట్ కోసం, మధ్యాహ్నం వొంటి గంట అయ్యేసరికి భోజనం కోసం కడుపులో గంట కొట్టినట్టు ఆకలి అవటం అనేది ఈ గడియారం వల్లనే జరుగుతోంది. ఇదంతా లయాత్మకంగా జరిగే ప్రక్రియ. దీన్ని ‘సర్కాడియన్ రిథమ్’ అంటారు. రాత్రి 10 అయ్యేసరికి నిద్ర ముంచుకు రావటం కూడా ఈ సర్కాడియన్ గడియారం వలనే జరుగుతోంది. మనం ఈ వేళల్ని మార్చాలని ప్రయత్నించటం జీవభౌతిక నియతిని మార్చటమే అవుతుంది. అందువలన ఏర్పడే అనారోగ్య స్థితిని ‘సర్కాడియన్ వ్యాధి’ అంటారు. వివిధ వాతవ్యాధులన్నీ ఈ సర్కాడియన్ వ్యాధుల పరిధిలోకే వస్తాయి.
‘లా జొల్లా’లోని జీవభౌతిక మార్పుల్ని అధ్యయనం చేసే ‘సల్క్’ పరిశోధనా సంస్థకు చెందిన శాస్తవ్రేత్తలు ఈ విషయం మీద పరిశోధన చేసి అందించిన నివేదికను మెడ్ న్యూస్ టు డే వెబ్ పత్రిక 2018 నవంబర్ 30న ప్రచురించింది. రాత్రి అనేది ముఖ్యంగా కళ్లకు విశ్రాంతి నివ్వటానికి ప్రకృతి నిర్దేశించిందనీ, మనిషి విద్యుత్ దీపకాంతి ద్వారా రాత్రిని పగలుగా మార్చాలని ప్రయత్నించటం చేత శరీరంలోని కాంతి గ్రాహక కణాలలో (లైట్ - సెన్సిటివ్ సెల్స్) మార్పులు ఏర్పడి సర్కాడియన్ గడియారాన్ని దెబ్బతీస్తాయని ఈ నివేదికలో వివరించారు.
కంటి లోపల రెటీనాలో కాంతి గ్రాహక కణాలుంటాయి. ‘మెలనోప్సిన్’ అనే ప్రొటీన్ సాయంతో కాంతి గ్రాహక కణాలు సంకేతాలు పంపుతూ శరీర జీవ నిర్మాణ క్రియలను (మెటబాలిజం) నడిపిస్తుంటాయి. వెలుతురు - చీకటి ఆధారంగా పనిచేసే ఈ కణాల కారణంగా ‘జీవన లయ’ (బయోలాజికల్ రిథం) ఏర్పడుతోంది. ఎక్కువ వెలుతురుకు గురైనప్పుడు 24 గంటల కాలవ్యవధిలో సగం సమయం వెలుగులోనూ, సగం సమయం చీకటిలోనూ మనం గడపాలనే ప్రకృతి నిర్దేశించింది. ఈ లయను కాపాడటానికే! విద్యుద్దీపాలు, సెల్‌ఫోన్లు, టీవీ, కంప్యూటర్ల కారణంగా మనిషి ఎక్కువ వెలుతురుకు బలౌతున్నాడు.
మెలనోప్సిన్ ప్రొటీన్ నిర్దేశిత సమయమూ, నిర్దేశిత పరిమాణం కన్నా ఎక్కువ వెలుతురు పొందుతుంటే, అది మెలటోనిన్ అనే హార్మోన్ మీద ప్రభావం చూపిస్తుంది. నిద్ర పట్టే యంత్రాంగాన్ని ఈ మెలటోనిన్ దెబ్బ తీస్తుందని శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. దీనివలన జీవ భౌతిక క్రియల లయాన్విత వ్యవస్థను దెబ్బ తీస్తుంది. మెలనోప్సిన్‌ని పెంచేందుకు అరెస్టిన్స్ అనే ప్రేరకాలను అందించే ప్రయోగాలు చేస్తున్నారు. ఇవన్నీ లోపాల్ని సరిచేసే ఔషధాలకు సంబంధించిన విషయాలు. కానీ, వెలుతురును కావలసినంత మాత్రమే వినియోగించే పద్ధతిలో జీవిస్తే, ఔషధ సేవన అవస్థ తప్పుతుంది కదా!
కొన్ని దేశాల్లో, కొన్ని ఋతువుల్లో రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. రాఅతి పదకొండయినా చీకటి పడకపోవచ్చు. అలాంటి దేశీయులు కూడా రాత్రి 10కన్నా ముందే తలుపులు మూసుకుని నిద్రపోవటమే మంచిదని దీని సారాంశం. రోజుకు 12 గంటలకన్నా ఎక్కువ సమయం వెలుతురులో గడపటం ప్రకృతికి విరుద్ధం అనీ, అది అనేక మెటబోలిక్ వ్యాధులకు కారణం అవుతోందనీ శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు.
మనం ఎంతసేపు మేలుకుని ఉన్నాం అనేదానికన్నా ఎంతసేపు, ఎంత కాంతిలో ఉన్నాం అనేది ముఖ్యం. ఎంత ఎక్కువ కాంతిలో ఉంటే అంత ఎక్కువ అనారోగ్యం. రేడియోల రోజుల్లో మనుషులు రాత్రి పదకొండు గంటల దాకా ఏ హరికథనో, సంగీత కచేరీనో వింటూ పడుకునేవాళ్లు. ఆ రోజుల్లో షుగరు వ్యాధి, బీపీ వ్యాధి, స్థూలకాయం లాంటి మెటబాలిక్ వ్యాధులు ఇంత ఎక్కువగా లేవు. టీవీలు స్మార్ట్ఫోన్లు, లాప్ టాప్‌లూ వచ్చాక మనకు తెలీకుండానే మన మీద చెడు పడ్తోంది.
ఇన్సులిన్ నిరోధం, షుగరు వ్యాధి, స్థూలకాయం, రక్తపోటు, కేన్సర్, ఇంకా ఇతర మెటబాలిక్ వ్యాధులు రావటానికి నిర్దేశిత సమయాన్ని మించి మనం అమితంగా వెలుతురులో గడపటం ఒక కారణం అవుతోంది. ఇది శరీరంలోని సహజమైన ‘నిద్ర - మెలకువ’ లయ (స్లీప్ వేక్ సైకిల్)ను కూడా దెబ్బతీస్తోంది.
ఆచార్య సచ్చిదానంద పండా అనే భారతీయ శాస్తవ్రేత్త ఈ పరిశోధనా బృందంలో ముఖ్యులు. అనేక దీర్ఘవ్యాధులు రావటానికి శరీరంలో సర్కాడియన్ లయ దెబ్బ తినటమే కారణం అంటున్నారు. ఇందుకు కంప్యూటర్లు, టీవీలు, సెల్‌ఫోన్ తెరలే కారణం కాబట్టి వీటిని ఆయన వెలుతురు తెరల వ్యాధులుగా ఆయన పేర్కొన్నారు.
వృత్తి వ్యాపకాల్లో మునిగి తేలే మనుషులు ప్రకృతి సహజసిద్ధమైన వ్యవస్థకు వ్యతిరేకంగా జీవించటం వలనే ఇన్ని అనర్థాలు కలుగుతున్నాయి. ‘బాడీ క్లాక్’ని సరి చేసుకోవటం మన బాధ్యత. మన అవసరం కూడా! చీకటీ విలువైనదే! తగినంత చీకటిని కూడా మనం కళ్లకు ఇవ్వాలి. భగవంతుడా! నాక్కొంచెం చీకటినివ్వు - అని వేడుకోవాల్సిన స్థితిలోకి మనం వెళ్లిపోతున్నాం. రాత్రి 10 తరువాత ఇంట్లో దీపాలు ఆర్పకపోతే శరీరంలో జీవ దీపం ఆరిపోయే ప్రమాదం ఉంది.
అందరం నిద్రపోతున్నాం. కానీ సరైన సమయంలో సరైన సమయం నిద్రపోలేక పోతున్నాం. అమెరికాలో 50 నుండి 70% మంది నిద్రలేమి వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. అన్నింటికీ అమెరికాని ఆదర్శంగా తీసుకునే మన మనోబలహీనత కారణంగా మనం కూడా ఇంచుమించు ఇదే స్థితిలో ఉన్నాం.
రాత్రిపూట చీకటికీ సమాన ప్రాతినిధ్యం ఇస్తే చాలా సమస్యలు తీరుతాయి. చీకటి వెలుగుల రంగేళీయే కదా.. జీవితం అంటే!

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com