S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/18/2020 - 01:29

వరంగల్, మార్చి 17: రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టామని రాష్ట్ర పోలీస్ డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్ నిట్ కళాశాల సమావేశ మందిరంలో వరంగల్, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ల పోలీస్ అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్, కరీంనగర్ రెండు ఉమ్మడి జిల్లాల పోలీస్ అధికారులకు నేరాలు అదుపుచేయడం కోసం తీసుకుంటున్న చర్యలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ చేశారు.

03/18/2020 - 01:26

హైదరాబాద్, మార్చి 17: పదో తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని, విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాయాలని విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. పదో తరగత పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని, పరీక్షలంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె కోరారు.

03/18/2020 - 01:24

హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు 2018 సాధారణ ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన పంటల రుణ మాఫీ హామీ ఇప్పుడు అమల్లోకి వస్తోంది. శాసనసభలో ఇటీవల ప్రతిపాదించిన వార్షిక బడ్జెట్‌లో రుణ మాఫీకి మొదటి దశ నిధులు కేటాయించారు. కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పంట రుణ మాఫీపై మంగళవారం మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి పేరుతో జారీ చేశారు.

03/18/2020 - 01:23

హైదరాబాద్, మార్చి 17: తెలంగాణలో ఉన్న వారెవరికీ ఇప్పటివరకు కరోనా సోకలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులతో మం గళవారం ఆయన ఇక్కడ మాట్లాడు తూ, ఇప్పటివరకు కరోనా పాజిటివ్ వ చ్చినవారు ఐదుగురని, వీరంతా ఇతర దేశాల నుండి వచ్చిన వారేనని తెలిపారు.

03/18/2020 - 01:18

హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్‌కు వేసుకున్న అంచనాల లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకుంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు కేంద్రం నుంచి తగ్గుతున్న పన్నుల వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌కు కోతలతో ఇంత భారీ బడ్జెట్ లక్ష్యానికి చేరుకోవడం సాధ్యమేనా? అనే అనుమానాలు తలెత్తున్నాయి.

03/17/2020 - 13:11

హైదరాబాద్: కరోనా భయంతో సికింద్రాబాద్ క్లబ్‌ను మూసివేశారు. 142 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ క్లబ్‌లో 700 మంది సభ్యులు ఉన్నారు. మొట్టమొదటి సారి కరోనా భయంతో మూసివేయటం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ క్లబ్‌ను మూసివేస్తున్నట్లు తెలిపారు. 22 వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ క్లబ్‌ను నిర్వహిస్తున్నారు. విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షిస్తోంది.

03/17/2020 - 06:41

హైదరాబాద్, మార్చి 16: తెలంగాణ హైకోర్టు ఇక మీదట వారంలో మూడు రోజులే పనిచేయాలని నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ జనరల్ సర్క్యులర్ జారీ చేశారు. కోవిడ్ ఉత్పాతం నేపథ్యంలో కరోనా అరికట్టేందుకు పటిష్టమైన చర్యలను తీసుకున్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకూ సోమవారం, బుధవారం, శుక్రవారం మాత్రమే హైకోర్టు పనిచేస్తుంది.

03/17/2020 - 06:40

హైదరాబాద్, మార్చి 16: పౌరసత్వ సవరణ చట్టం, తదనంతరం ఎన్‌పీఆర్, ఎన్‌సీఆర్‌ల అమలుకు సంబంధించి దారుణమైన నిబంధనలు ఉన్నాయని, ఎట్టిపరిస్థితిల్లో వాటిని అంగీకరించేది లేదని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ పేర్కొన్నారు. సోమవారం నాడు సీఏఏపై సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొంటూ సీఏఏతో ముస్లింలకు తీవ్రమైన ముప్పు ఉందని పేర్కొన్నారు. సీఏఏను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదని చెప్పారు.

03/17/2020 - 06:38

హైదరాబాద్, మార్చి 16: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పీఆర్), జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) లపై తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టిన తీర్మానంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హల్‌చల్ చేశారు. ఈ తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొంటూ, ఈ అంశాలపై కేంద్ర చేసిన చట్టాలు ఏ మతానికి చెందిన వ్యక్తులకు వ్యతిరేకం కాదన్నారు.

03/17/2020 - 06:36

హైదరాబాద్, మార్చి 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చాలా సందేహాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉందని కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ చివరి రోజూ బడ్జెట్ పద్దులపై భట్టి విక్రమార్క మాట్లాడుతూ 2000-2001 ఆర్థిక బడ్జెట్‌లో చూపించిన పద్దుల వివరాలు పరిశీలిస్తే మంచిగా అనిపిస్తోందన్నారు.

Pages