S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/23/2015 - 17:26

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడులదైంది. 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి మార్చి 2 నుంచి 21వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలు రోజువిడిచి రోజు జరుగుతాయి. ముందుగా జనవరి 26న ‘నీతి-మానవ విలువలు’ అన్న అంశంపై ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తారు. ఫిబ్రవరి 3నుంచి 24వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. 8 లక్షలమంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవనున్నారు.

11/23/2015 - 12:02

భద్రాచలం: కార్తీక మాసం రెండో సోమవారం, క్షీరాబ్ధి సందర్భంగా భద్రాచలం ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి దీపారాధనలో పాల్గొంటున్నారు. గోదావరి మాతకు పసుపు కుంకుమలు, హారతులు సమర్పిస్తున్నారు.

11/23/2015 - 12:01

మెదక్: మెదక్ జిల్లా బీరంగూడలో ఓ కానె్వంట్‌లో ఎల్‌కెజి చదువుతున్న ఐదేళ్ల బాలుడు పృథ్వి అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సోమవారం ఉదయం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను చేపట్టారు. అనుమానితులపై ఆరా తీస్తున్నట్లు రామచంద్రపురం పోలీసులు చెప్పారు.

11/21/2015 - 13:50

ఖమ్మం: నేలకొండపల్లి మండలం అనంతనగర్‌లో గురుకులు పాఠశాల వసతిగృహంలో 40మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం వికటించి అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఆసుపత్రికి తరలించి విద్యార్థినులుకు చికిత్స అందిస్తున్నారు.

11/21/2015 - 13:42

వరంగల్‌ : తొర్రూరు మండలం పిక్యాతండాకు చెందిన ఓటర్లు వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ను బహిష్కరించారు. తండాలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని నిరసిస్తూ తండా వాసులు పోలింగ్‌లో పాల్గొన లేదు. ప్రభుత్వాలు తమ గ్రామాన్ని అభివృద్ధిచేయటం లేదని, అందుకే పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు తండా వాసులు పేర్కొన్నారు.

11/21/2015 - 13:35

వరంగల్‌: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వడ్డేపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌ దంపతులు కొడకండ్ల పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.పర్వతగిరిలోని పోలింగ్‌ కేంద్రంలో తెలంగాణ తెదేపా శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

11/21/2015 - 06:21

హైదరాబాద్, నవంబర్ 20: ఉబర్ క్యాబ్ సంస్థలో పని చేస్తూ ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్ మహ్మద్ జహీరుద్దీన్ ఆత్మహత్య కేసులో జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి హామీ ఇచ్చారు. ఉమర్ క్యాబ్ సంస్థ జహీరుద్దీన్ ఆత్మహత్యకు బాధ్యత వహించాలని వారు మంత్రుల దృష్టికి తెచ్చారు.

11/21/2015 - 06:20

హైదరాబాద్, నవంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టనున్న 60 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి రూ. 3344 కోట్ల రుణం ఇవ్వడానికి హడ్కో సంస్థ ముందుకు వచ్చింది. హడ్కో నుంచి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ తీసుకోనున్న రుణానికి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వడానికి అంగీకారం తెలిపినట్టు గృహ నిర్మాణశాఖ కార్యదర్శి దాన కిషోర్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.

11/21/2015 - 06:19

హైదరాబాద్, నవంబర్ 20: రబీలో ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు 50శాతం రాయితీపై విత్తనాలు సరఫరా చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వాతావరణ పరిస్థితులు, భూగర్భ జలాల లభ్యత దృష్ట్యా రబీలో ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు చెప్పారు.

11/21/2015 - 06:18

హైదరాబాద్, నవంబర్ 20: నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మరో 11వందల ఇళ్లు అదనంగా కేటాయించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. జగిత్యాల నియోజకవర్గంలో త్వరలోనే పర్యటించనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. నిజామాబాద్ ఎంపి కవిత, నిజామాబాద్ ఎమ్మెల్యే బి గణేష్ గుప్తా, జగిత్యాల టిఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ డాక్టర్ సంజయ్ సచివాలయంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను శుక్రవారం కలిశారు.

Pages