S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/18/2015 - 08:00

ఆసుపత్రిపై బంధువుల దాడి,ఫర్నిచర్ ధ్వంసం * వైద్యురాలి అరెస్ట్

12/17/2015 - 11:34

ఖమ్మం: చత్తీస్‌గఢ్‌లోని సుకుమా నుంచి హైదరాబాద్‌కు బస్సులో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. సుమారు 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పాల్వంచ పోలీసులు చెప్పారు.

12/17/2015 - 11:34

హైదరాబాద్: అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వారు తనను వేధిస్తున్నారని ఓ కోడలు ఇక్కడ బాలాపూర్‌లో అత్తవారింటి ఎదుట గురువారం ఆందోళన ప్రారంభించింది. బాధితురాలు స్వాతికి గత ఏడాది 20 లక్షల కట్నం ఇచ్చి యశ్వంత్‌తో వివాహం జరిపించారు. ఐతే అదనపు కట్నం కోసం ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. స్వాతి ఆందోళన ప్రారంభించడంతో ఆమె తల్లిపై యశ్వంత్ తండ్రి దాడి చేశారు.

12/17/2015 - 07:15

హైదరాబాద్, డిసెంబర్ 16: నగరంలోని కిమ్స్ హాస్పిటల్‌లో ఎక్యూట్ స్ట్రోక్ సెంటర్‌ను హీరో జూనియర్ ఎన్టీఆర్ బుధవారం ప్రారంభించారు. న్యూరాలజీ విభాగంపైనా, న్యూరో సంబంధిత స్ట్రోక్స్, రోగాలపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఈ సెంటర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ చైతన్య కార్యక్రమానికి న్యూరోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కూడా చేయూత నందిస్తోంది.

12/17/2015 - 07:14

హైదరాబాద్, డిసెంబర్ 16: గ్రేటర్ హైదరాబాద్ శివారులో కల్తీ ఉత్పత్తులు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. కల్తీ నూనె, నెయ్యి, గరం మసాలాలు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొని వారం రోజులు గడవక ముందే తాజాగా మరో కల్తీ వ్యాపారం బయటపడింది. నగరశివారులోని పహాడిషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలోగల శ్రీరామ కాలనీ పారిశ్రామిక వాడలో కల్తీ శనగ పిండి తయారు చేస్తున్నారు.

12/17/2015 - 07:00

నిజామాబాద్/సంగారెడ్డి, డిసెంబర్ 16: దొంగల ముఠాలు ఏకంగా ఏటిఎంలపైనే కనే్నశాయ. వరుస సంఘటనలతో పోలీసులకే సవాల్ విసురుతున్నాయ. మంగళవారం తెల్లవారుజామున కోటగిరి, వర్ని మండలాల్లోని నాలుగు ఎటిఎం సెంటర్లలో దొంగలు చొరబడి సుమారు 43లక్షల రూపాయల నగదును అపహరించుకుపోయన 24 గంటల్లోపే మరోసారి తెగబడ్డారు. ఈసారి మెదక్ ఏటి ఎంలపై కనే్నసిన దొంగలు మూడు చోట్ల చోరీకి పాల్పడ్డారు.

12/17/2015 - 06:58

భద్రాచలం, డిసెంబర్ 16: ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి బుధవారం భక్తులకు పరశురామావతారంలో దర్శనం ఇచ్చారు. స్వామికి గర్భగుడిలో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఉత్సవమూర్తులను పరశురామావతారంలో అలంకరించారు.

12/17/2015 - 06:55

వరంగల్, డిసెంబర్ 16: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత తొలిసారిగా జరుగుతున్న మేడారం జాతర ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తామని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా మేడారంలో సమ్మక్క - సారలమ్మ జాతర ఏర్పాట్ల పనులను పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈసారి జరిగే మేడారం జాతర పనులకు రూ.172 కోట్లు కేటాయించి పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

12/17/2015 - 06:55

పాన్‌గల్, డిసెంబర్ 16: మహబూబ్‌నగర్ జిల్లా పాన్‌గల్ మండల పరిధిలోని కొత్తపేట, గూడెం, పాన్‌గల్ గ్రామాల సమీపంలో రాకెట్ పడిందన్న వదంతులు బుధవారం సాయంత్రం వ్యాపించడంతో మండల ప్రజలు భయాందోళన చెందారు. రాకెట్ మంటలు, పొగలు విరజిమ్మడంతో పొలాల సమీపంలో పడిందని గ్రామాల ప్రజలు పంట పొలాలకు చేరుకొని పరిశీలించారు. ఎస్.ఐ శ్రీనివాస్, పోలీసులు గ్రామాల పరిసరాలలో పరిశీలించారు.

12/17/2015 - 06:54

టేక్మాల్, డిసెంబర్ 16: అరణ్యంలో ఉండాల్సిన చిరుత పులులు జనారణ్యంలోకి వస్తున్నాయి... భయాందోళనతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు... మొన్న తుక్కాపూర్... నిన్న కోనాపూర్... నేడు కోరంపల్లి...మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని కోరంపల్లి గ్రామం మంజీరా పరివాహక ప్రాంతంకు చేరువలో ఉంది.

Pages