-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
ఖమ్మం: కిడ్నీ ముఠా డొంక ఖమ్మం జిల్లాలో కూడా బయటపడింది. ఖమ్మం జిల్లాకు చెందిన దుమ్మపేట మండలం నాయుడుపేట వాసి మువ్వ నరేశ్ కిడ్నీని ముఠా తీసుకుంది. హైదరాబాద్ హోటల్లో మత్తుమందు ఇచ్చి కిడ్నీ తీసుకున్నట్లు బాధితుడు తెలిపాడు. కొలంబో తీసుకెళ్తామని చెప్పి నరేష్ను ఈ ముఠా మోసగించింది. సత్తుపల్లి డీఎస్పీ కార్యాలయంలో నరేశ్ను పోలీసులు విచారిస్తున్నారు.
వరంగల్: జిల్లాలోని నర్సంపేటలో వృద్ధుడి దృష్టి మరల్చి రూ.2.02 లక్షలు దోపిడీ చేశారు. వృద్ధుడు బ్యాంకు ఖాతా నుంచి సొమ్ము తీసుకుని వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార టిఆర్ఎస్ పార్టీ అనేక అక్రమాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్కుమార్ రెడ్డి, జానారెడ్డి, దానం నాగేందర్ తదితరులు శుక్రవారం ఉదయం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు.
మెదక్: మహిళా సర్పంచ్ను బైక్తో ఢీకొట్టాడని గ్రామస్థులు చితకబాదడంతో ఓ యువకుడు మృతి చెందగా, ఇబ్రహీంపూర్లో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్లో సర్పంచ్ లక్ష్మిని కరీంనగర్ జిల్లా జిల్లెల గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు బైక్తో ఢీకొట్టాడు. దీంతో రెచ్చిపోయిన గ్రామస్తులు చితకబాదడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
హైదరాబాద్: శంషాబాద్ మండలం తొండుపల్లిలో నకిలీ నోట్లను తయారుచేస్తున్న బీహార్కు చెందిన కమాలుద్దీన్, స్థానిక యువకుడు మహేష్ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు 90 వేల రూపాయల విలువైన నకిలీ నోట్లను, లాప్టాప్, కలర్ ప్రింటర్, 50 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపం చెంది ఇక్కడి రామంతాపూర్కి చెందిన విద్యార్థి శివకిరణ్ అమెరికాలోని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయం హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ ఎంఎస్ చదువుతున్న ఈ యువకుడు చదువు పూర్తి చేసుకొని కొద్దిరోజుల్లో నగరానికి వచ్చేందుకు టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నాడు. ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవడంతో శివకిరణ్ కుటుంబం విషాదంలో కూరుకుపోయింది.
హైదరాబాద్: కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలో ధర్మారెడ్డి నగర్లోని ఓ ప్రైవేటు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో అపర్ణ అనే యువతి గురువారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. ఆమె జెఎన్టియులో పనిచేస్తున్నట్లు కేసు నమోదు చేసిన పోలీసులు చెప్పారు.
హైదరాబాద్, జనవరి 7: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై కోర్టు ఇచ్చిన తీర్పును బిజెపి స్వాగతిస్తోందని, ఈ తీర్పు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు చెంపపెట్టు అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఆ పార్టీ శాసనసభ పక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్లు తెలిపారు. 74వ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.
హైదరాబాద్, జనవరి 7: రియల్ఎస్టేట్ రంగ అభివృద్ధికి మిగిలిన 17 సవరణలూ చేయాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అసోసియేషన్స్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కోరింది. ప్రస్తుతం 23 సవరణలు చేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కృషి చేసినందుకు అసోసియేషన్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్, జనవరి 7: వరంగల్ జిల్లాలో ఇద్దరు మైనర్ బాలికలను హతమార్చిన నిందితులను అరెస్టు చేయాలని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.