-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, మే 1: ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. ప్రైవేట్ విద్యాసంస్థలో నాణ్యతలేని విద్యతో పాటు తల్లిదండ్రులకు పెనుభారంగా మారిన ఫీజుల మోతకు అడ్డుకట్ట వేయడానికి తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తున్న సంస్థలపై ఉక్కుపాదం మోపే విషయంలో రాజీ పడకూడదని గట్టి పట్టుదలతో ఉంది.
హైదరాబాద్, మే1: ప్రపంచ కార్మిక దినోత్సవం ఇద్దరు కార్మికుల ఇళ్లల్లో విషాదం నింపింది. హైదరాబాద్ మహానగరంలో మ్యాన్హోల్లో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు ఊపిరి ఆడక అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మురుగునీటి కాలువను శుభ్రం చేసేందుకు మ్యాన్హోల్లోకి దిగిన కార్మికులిద్దరికీ ఆక్సీజన్ అందక ఉక్కిరిబిక్కిరై దుర్మరణం పాలయ్యారు.
హైదరాబాద్, మే 1: రాష్ట్రంలో కార్మికుల కనీస వేతనాన్ని పదివేల రూపాయలకుపైగా ఉండేలా త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు కార్మిక, ఉపాధి కల్పన మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రకటించారు. కార్మికుల సమస్యలు, డిమాండ్లు ఏమిటో తమ ప్రభుత్వానికి క్షుణ్ణంగా తెలుసన్నారు. కార్మికులు ఆందోళనలు చేపట్టాల్సిన అవసరం లేకుండానే సమస్యలు పరిష్కరిస్తున్నట్టు వెల్లడించారు.
హైదరాబాద్, మే 1: ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో ఇళ్లు ఇతర నిర్మాణాలు చేసుకున్న వారికే వాటిని క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన జీవో 59 ఇంకా బాలారిష్టాలను అధిగమించలేకపోతుంది. నామామాత్రపు రుసుంతో ఆక్రమితదారునికే వాటిపై హక్కులు కల్పించేందుకు జారీ చేసిన జీవో 59కు అధికారుల వక్ర బాష్యాల వల్ల ప్రభుత్వ సద్దుదేశం నెరవేరకుండా పోతుంది.
కరీంనగర్, మే 1: ఒకప్పుడు ‘మావో’లకు అది పెట్టని కోట. అలాంటి తూర్పు డివిజన్లోని దండకారణ్యంలో తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోమవారం అడుగుపెట్టబోతున్నారు. మేడిగడ్డ (కాళేశ్వరం) ఆనకట్ట శంకుస్థాపన సందర్భంగా తూర్పు డివిజన్లో సిఎం పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సిఎం కెసిఆర్ ఆదివారం రాత్రి 7:40గంటలకు కరీంనగర్ శివారు తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్కు చేరుకున్నారు.
ఖమ్మం, మే 1: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం లోక్సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ప్రధాన అనుచర వర్గమంతా టిఆర్ఎస్లో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. గత కొద్ది రోజులుగా ఎంపితో పాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇతర ప్రధాన నేతలు అధికార పార్టీలో చేరనున్నారనే ప్రచారం ఊపందుకుంది.
హైదరాబాద్:మ్యాన్హోల్లో దిగి పనిచేస్తున్న ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు ఊపిరాడక మరణించారు. హైదరాబాద్లోని రామ్కోఠి తిలక్నగర్లో ఆదివారం ఉదయం ఈ విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్, ఏప్రిల్ 30: ఎంబిబిఎస్ విద్యార్ధులు గ్రామాల్లో ఏడాదిపాటు సేవ చేయాలనే నిబంధనను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారి జీవో ఎంఎస్ నెంబర్ 28ను జారీ చేశారు. చాలాకాలంగా జూనియర్ డాక్టర్లు ఈ నిబంధనను తొలగించాలని తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 30 : వ్యవసాయం, రవాణా, ఎక్సైజ్ శాఖల్లో 1477 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్పిఎస్సి) శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. వ్యవసాయ విస్తరణాధికారులు గ్రేడ్-2 పోస్టులు 1000, రవాణా శాఖలో 137 కానిస్టేబుల్ పోస్టులు, ఎక్సైజ్ శాఖలో 340 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేశారు.
మహబూబ్నగర్, ఏప్రిల్ 30: ఆంధ్ర పార్టీల నేతలు రాజకీయ పబ్బం కోసం చిల్లర రాజకీయాలకు దిగుతున్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా దీక్షకు దిగుతాననడం సిగ్గుమాలిన చర్య, దుర్మార్గమైన నిర్ణయమని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.