-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్: నిబంధనలను అతిక్రమించి అర్ధరాత్రి తర్వాత కూడా పబ్ తెరిచి ఉంచినందుకు జూబ్లీహిల్స్లోని ఎయిర్ పబ్ నిర్వాహకులకు ఎర్రమంజిల్ కోర్టు ఆరు రోజుల జైలుశిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. గతంలో పలుసార్లు పోలీసులు కేసులు నమోదు చేసినా మార్పు రాకపోవడంతో పబ్ నిర్వాహకులు అనిరుధ్ అగర్వాల్, మయాంక్ అగర్వాల్కు జైలు శిక్ష విధించారు.
సంగారెడ్డి, మే 5: శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించడానికి జిల్లా సేనలను ముందుండి నడిపిస్తూ సత్ఫలితాలు సాధించిన మెదక్ జిల్లా ఎస్పీ బడుగుల సుమతికి కేంద్ర ప్రభుత్వం అందజేసే ఫిక్కీ స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి చౌదరి చేతుల మీదుగా ఎస్పీ సుమతి ఈ అవార్డును అందుకున్నారు.
హైదరాబాద్, మే 5: మావోయిస్టుల బంద్ విఫలమైంది. నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో సైతం బంద్ ప్రభావం కనిపించలేదు. దండకారణ్యంలో గ్రీన్హంట్ దాడులు నిలిపివేయాలని, బూటకపు ఎన్కౌంటర్లకు నిరశనగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఈ నెల 4, 5 తేదీలలో బంద్కు పిలుపునిచ్చింది.
బాన్సువాడ, మే 5: వర్షాకాలం సమీపిస్తున్నందున మిషన్ కాకతీయ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సకాలంలో పూర్తి చేయించేందుకు వీలుగా ఇరిగేషన్ అధికారులు తమతమ కార్యస్థానాల్లోనే ఉండాలని, ఎవరైనా అందుబాటులో లేకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు హెచ్చరించారు.
హైదరాబాద్, మే 5: అధికార టిఆర్ఎస్ పార్టీలో వాట్సఫ్ సందేశాలు కలకలం రేపుతున్నాయి.
కరీంనగర్, మే 5: అటు సంబరమైనా.. ఇటు విషాదమైనా.. దావత్ (పార్టీలు) మాత్రం చేసుకోవడం సర్వసాధారణంగా మారింది. ఇంకేముంది మద్యం వ్యాపారం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ అన్న చందంగా వర్థిల్లుతుండగా, అబ్కారీ ఖజానా కాసులతో గలగలలాడుతోంది. ఇక మండుటెండల్లో బీర్లు పారులై పారింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.1400కోట్ల లిక్కరు, బీర్లు అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోల్చితే రూ.200కోట్లు అమ్మకాలు అదనంగా పెరిగాయి.
సంగారెడ్డి, మే 4: విజయ దశమి రోజున చేపట్టే ఏ కార్యక్రమమైనా దిగ్విజయంగా పూర్తవుతుందనుకున్నారు... పూజలు చేసి, కొబ్బరికాయ కొట్టడంతో త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఆశ పడ్డారు, కలలు కన్నారు... కానీ అదంతా పగటి కలగానే మిగిలిపోయంది. ఇది కాగజ్ మద్దూర్ గ్రామవాసుల దీనావస్థ. డబుల్ బెడ్రూం ఇల్లు ఎప్పటికి పూర్తవుతుందో కానీ, ప్రస్తుతం ఉన్న తాత్కాలిక గుడిసె కూలిపోయ గూడు లేని పక్షుల్లా జీవనం కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్, మే 5: హైదరాబాద్లో ఇటీవల మ్యాన్హోల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. జిహెచ్ఎంసి, హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణ మున్సిపల్ శాఖ, హోంశాఖ ఈ సంఘటనపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు గురువారం ఆదేశించింది.
హైదరాబాద్, మే 5: ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ను బాహాటంగా ఉల్లంఘిస్తోందని టిపిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తంకుమార్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని ఎన్నికలు సజావుగా జరిగేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు.
మహబూబ్నగర్, మే 5: పాలమూరు అంటేనే వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యలు, బీడుబారిన పొలాలు, నీటి కష్టాలు గుర్తుకు వస్తుంటాయని, ఈ దారిద్య్రం పోవాలంటే పాలమూరు ఎత్తిపోతల పథకంతోనే వీటన్నింటికీ బ్రేక్ పడుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.