S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/05/2016 - 07:17

హైదరాబాద్, జూన్ 4 : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 130 సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, 30 సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చిందని రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్‌చైర్మన్ ఎస్. నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, 2016-17 విద్యాసంవత్సరం నుండే వీటిని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.

06/05/2016 - 07:17

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ విస్తరణాధికారుల నియామకానికి పబ్లిక్ సర్వీసు కమిషన్ 4వ తేదీన నిర్వహించిన ఎంపిక పరీక్షకు 6479 మంది హాజరయ్యారు. ఈ పరీక్షకు 7645 మందికి హాల్‌టిక్కెట్లు జారీ చేశామని, 4వ తేదీన ఉదయం పేపర్-1కు 6491 మంది, సాయంత్రం పేపర్-2కు 6479 మంది హాజరయ్యారని కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు.

06/05/2016 - 07:16

హైదరాబాద్, జూన్ 4 : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగాయి. మెల్‌బోర్న్‌లోని క్యారమ్ డౌన్స్ ప్రాంతంలో శివ విష్ణు ఆలయ ప్రాంగణంలోని సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత అమరవీరుల స్థూపానికి కవిత నివాళులు అర్పించారు.

06/05/2016 - 07:15

హైదరాబాద్, జూన్ 4: హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ప్రాంతం ఆక్రమణలకు గురికావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై తక్షణమే హెచ్‌ఎండిఏ, జిహెచ్‌ఎంసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ చెరువు ఆక్రమణలకు గురైందని పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.

06/05/2016 - 07:15

హైదరాబాద్, జూన్ 4: రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయకూడదని, రాష్టవ్య్రాప్తంగా ఉన్న 29వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విన్నవించారు. రేషనలైజేషన్ ముసుగులో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందంటూ పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన పేర్కొన్నారు.

06/04/2016 - 08:22

హైదరాబాద్, జూన్ 3: తెలంగాణలో స్కూలు ఫీజులను కట్టడి చేస్తామని, స్కూళ్ల బరితెగింపునకు ముకుతాడు వేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించిన కొద్ది గంటలకే స్కూలు ఫీజుల నిర్ధారణ అధికారం పాలకమండళ్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు డిఇఓలకు మెమోలు పంపించారు.

06/04/2016 - 08:20

హైదరాబాద్, జూన్ 3: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న విఎల్‌ఎస్‌ఐ అకాడమీలో భాగస్వామి అయ్యేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎఎండి సంసిద్థత వ్యక్తం చేసింది. ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు సిలికాన్ వ్యాలీ పర్యటనలో భాగంగా ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎఎండిలో కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రూత్ కాటర్‌తో సమావేశం అయ్యారు.

06/04/2016 - 08:10

హైదరాబాద్, జూన్ 3: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు గడచిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు జరుగగా, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ (ఎండోమెంట్స్) నిర్లిప్తతగా కొనసాగుతోంది. సారథి లేని ఈ శాఖ నిర్వీర్యంగా కొనసాగుతోంది. భద్రాచలం, యాదాద్రి, వేములవాడ తదితర పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కె.

06/04/2016 - 06:22

హైదరాబాద్, జూన్ 3: కృష్ణా నదీ జలాల యాజమాన్య మండలి (కృష్ణా రివర్ బోర్డు) తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కృష్ణా జలాల పంపిణీని తన ఆధీనంలోకి తీసుకోవాలన్న బోర్డు నిర్ణయం పట్ల తెలంగాణ సర్కారు తీవ్ర అభ్యంతరం తెలిపింది.

06/04/2016 - 06:21

హైదరాబాద్, జూన్ 3: సాదా కాగితాలపై జరిగిన భూముల అమ్మకాలను (సాదా బైనామా) అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియపై రెనిన్యూ శాఖ శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది. సాదా బైనామాల ఉచిత రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 15వరకు గడువు విధించింది. సాదా కాగితాలపై జరిగిన భూ లావాదేవీలకు జూన్ 2, 2014 కట్ ఆఫ్ డేట్‌ను ఖరారు చేశారు.

Pages